Mahua Moitra : గుజ‌రాత్ మోడ‌ల్ ను ద్వేషించండి – మ‌హూవా

ఎమ్మెల్యే కామెంట్స్ పై మోయిత్రా ఆగ్ర‌హం

Mahua Moitra : గుజ‌రాత్ మోడ‌ల్ ప‌దే ప‌దే చెప్ప‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు టీఎంసీ ఎంపీ మ‌హూవా మోయిత్రా(Mahua Moitra). బిల్కిస్ బానో అత్యాచారం, కుటుంబీకుల‌ను దారుణ హ‌త్య‌కు పాల్ప‌డిన జీవిత ఖైదు క‌లిగిన 11 మందిని గుజ‌రాత్ ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది.

దీనిపై తీవ్రంగా నిర‌స‌న వ్య‌క్త‌మైంది దేశ వ్యాప్తంగా. కేంద్ర మంత్రి ప్ర‌హ్లాద్ జోషి రేపిస్టుల‌ను స‌మ‌ర్థించ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. రేపిస్టుల‌ను సంస్కారీ అని పిలిచిన బీజేపీ పున‌రావృత ఎమ్మెల్యేపై మ‌హూవా మోయిత్రా నిప్పులు చెరిగారు. శ‌నివారం తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు.

ఇదిలా ఉండ‌గా 15 ఏళ్ల పాటు జైలు జీవితం గ‌డిపిన దోషుల‌ను విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించిన ప్యానెల్ లో బీజేపీ ఎమ్మెల్యే చంద్ర సింగ్ రౌల్జీ కూడా ఉన్నారు.

ఇదిలా ఉండ‌గా బిల్కిస్ బానో దోషుల విడుద‌ల‌కు వ్య‌తిరేకంగా కోర్టుకు వెళ్లిన వారిలో తృణ‌మూల్ ఎంపీ మ‌హూవా మోయిత్రా కూడా ఉన్నారు. బీజేపీపై తీవ్రంగా మండిప‌డ్డారు.

గుజ‌రాత్ మోడ‌ల్ ని ద్వేషించండి. చంపండి..ఆపై పండుగ చేసుకోండి ..బ‌హుమ‌తి పొందండి లేదా టికెట్ ద‌క్కించుకోండి అంటూ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు టీఎంసీ ఎంపీ .

అధికార పార్టీ త‌న గోద్రా ఎమ్మెల్యేకు మ‌ళ్లీ ఎన్నిక‌ల టికెట్టు ఇవ్వ‌డం గురించి ప్ర‌స్తావించారు. కాగా యావ‌జ్జీవ కారాగార శిక్ష ప‌డిన 11 మందిని 15 సంవ‌త్స‌రాల శిక్ష త‌ర్వాత మంచి ప్ర‌వ‌ర్త‌న కార‌ణంగా గుజ‌రాత్ స‌ర్కార్ కేంద్రం ఆమోదంతో దేశానికి స్వ‌తంత్రం వ‌చ్చిన ఆగ‌స్టు 15న విడుద‌ల చేసింది.

మ‌హూవాతో పాటు టీఎంసీ చీఫ్‌, ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ కూడా సుప్రీంకోర్టులో దాఖ‌లు చేసిన పిటిష‌నర్ల‌లో ఒక‌రుగా ఉన్నారు.

Also Read : చెర‌సాల‌ను వీడిన న‌ళిని శ్రీ‌హ‌ర‌న్

Leave A Reply

Your Email Id will not be published!