Hyderabad: సౌతాఫ్రికాలో మీర్‌పేట్‌ యువకుడు మృతి

సౌతాఫ్రికాలో మీర్‌పేట్‌ యువకుడు మృతి

Hyderabad : సౌతాఫ్రికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్(Hyderabad) నగరానికి చెందిన ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. మారుతీనగర్‌కు చెందిన లిఖిత్‌ గౌడ్‌ అనే యువకుడు సౌతాఫ్రికా వెళ్లాడు. అయితే.. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో లిఖిత్‌గౌడ్‌ మృతిచెందాడు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…

Hyderabad Youth in South Africa

కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండాలనే ఉద్దేశంతో బాలాపూర్‌ మండలం మీర్‌పేట్‌ కార్పొరేషన్‌ లోని మారుతీనగర్‌కు చెందిన దుర్గాపతి ప్రమోద్‌గౌడ్‌ కుమారుడు లిఖిత్‌గౌడ్‌ (27) ఏడాదిన్నర క్రితం సౌతాఫ్రికాలోని బొత్స్వానాలోని స్ర్పౌట్‌ డ్రిల్లింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో డైరెక్టర్‌గా ఉద్యోగంలో చేరాడు. అక్కడ తన మిత్రులతో కలిసి ఉంటున్నాడు. గత నెల 30న కంపెనీ పని నిమిత్తం సిబ్బందితో కలిసి కారులో వెళ్తుండగా వేగంగా దూసుకువచ్చిన భారీ వాహనం వారి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లిఖిత్‌ గౌడ్‌ అక్కడికక్కడే దుర్మరణం పాలయినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రమాదం విషయం తెలియగానే లిఖిత్‌ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

చెట్టంత కొడుకు ఇక లేడనే విషయాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారు. కాగా లిఖిత్‌ మృతదేహానికి పోస్టుమార్టం కార్యక్రమాలు పూర్తి చేసి మీర్‌పేట్‌కు పంపించడానికి అక్కడి భారత హైకమిషన్‌ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గురువారం మధ్యాహ్నానికి మృతదేహం మారుతీనగర్‌ లోని నివాస గృహానికి చేరుకునే అవకాశమున్నదని కుటుంబసభ్యులు తెలిపారు.

Also Read : Nirmal SP: వృద్ధునిపై దురుసుగా ప్రవర్తించిన ఏఎస్సై పై సస్పెన్షన్ వేటు

Leave A Reply

Your Email Id will not be published!