IAS Officer Wife: గ్యాంగ్‌ స్టర్‌ తో లేచిపోయి వచ్చి ఆత్మహత్య చేసుకున్న ఐఏఎస్‌ అధికారి భార్య !

గ్యాంగ్‌ స్టర్‌ తో లేచిపోయి వచ్చి ఆత్మహత్య చేసుకున్న ఐఏఎస్‌ అధికారి భార్య !

IAS Officer Wife: ఓ మహిళ క్షణికావేశం ఓ ఐఏఎస్ అధికారి కుటుంబాన్ని రోడ్డున పడేసింది. ఓ గ్యాంగ్ స్టర్ తో పరిచయం ఏర్పాటు చేసుకున్న ఓ ఐఏఎస్ అధికారి భార్య… అతనితో కలిసి నేరాలకు పాల్పడింది. అరెస్టు నుండి తప్పించుకునే క్రమంలో గ్యాంగ్ స్టర్ తో కలిసి లేచిపోయింది. దీనితో అవాక్కైన ఆ ఐఏఎస్ అధికారి…. ఆమెతో విడాకులకు సిద్ధమయ్యారు. ఇంతలో ఏమైందో ఏమోగాని… గ్యాంగ్ స్టర్ ను వదిలిపెట్టి మరల భర్త వద్దకు వచ్చిన ఆ మహిళ అనూహ్యంగా ఆత్మహత్య చేసుకుని తనువు చాలించింది. ఈ ఘటన గాజరాత్ లోని గాంధీ నగర్ లో జరిగింది.

IAS Officer Wife…

ఇక పూర్తి వివరాల్లోకి వెళితే… గుజరాత్‌ కేడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి రణ్‌జీత్‌కుమార్‌(Ranjit Kumar) రాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌లో సెక్రటరీగా పని చేస్తున్నారు. ఆయన భార్య సూర్య జై కి కొంతకాలం క్రితం తమిళనాడుకు చెందిన ఓ గ్యాంగ్‌ స్టర్‌ తో పరిచయం ఏర్పడింది. తొమ్మిది నెలల క్రితం ఆ గ్యాంగ్‌ స్టర్‌ తో కలిసి ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. వీరిద్దరూ కలిసి జులై 11న తమిళనాడులోని ఓ బాలుడిని కిడ్నాప్‌ చేసేందుకు యత్నించారు. మధురై పోలీసులు తక్షణమే స్పందించి బాలుడిని కాపాడారు. అప్పటినుంచి గ్యాంగ్‌ స్టర్‌, సూర్య జై కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే గత శనివారం ఆమె గాంధీనగర్‌లోని తన భర్త రణ్‌జీత్‌కుమార్‌ ఇంటికి వచ్చింది. కానీ ఐఏఎస్‌ అధికారి ఆమెను ఇంట్లోకి రానివ్వలేదు. దీనితో విషం తాగిన సూర్య జై 108కు ఫోన్‌ చేసింది. ఆమెను స్థానిక ఆసుపత్రిలో చేర్చగా… చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందినట్లు పోలీసులు వెల్లడించారు.

ఘటనపై రణ్‌జీత్‌ తరఫు న్యాయవాది స్పందిస్తూ… ‘‘ఐఏఎస్‌ దంపతులిద్దరూ గతేడాది నుంచి దూరంగా ఉంటున్నారు. రణ్‌జీత్‌ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. గత శనివారం భార్య ఇంటికి రాగా.. ఆమెను లోనికి అనుమతించొద్దని పనివాళ్లకు చెప్పి ఆయన విడాకుల కేసు పనిమీద బయటకు వెళ్లారు. తిరిగొచ్చేసరికి ఆమె ఆత్మహత్యకు పాల్పడింది’’ అని తెలిపారు. కాగా.. ఆమె మృతదేహాన్ని తీసుకునేందుకు కూడా ఆయన నిరాకరించినట్లు సమాచారం.

Also Read : INS Brahmaputra: ఐఎన్‌ఎస్‌ బ్రహ్మపుత్రలో అగ్నిప్రమాదం !

Leave A Reply

Your Email Id will not be published!