Rahul Gandhi : న‌న్ను తిట్ట‌క‌ పోతే పొద్దు గ‌డ‌వ‌దు – రాహుల్

మోదీ..బీజేపీ శ్రేణుల‌పై షాకింగ్ కామెంట్స్

Rahul Gandhi : భార‌త జోడో యాత్ర చేప‌ట్టిన రాహుల్ గాంధీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. నా కోసం , నా స్వ‌లాభం కోసం ఈ యాత్ర‌ను చేప‌ట్ట‌డం లేదు. ఇవాళ ఎంద‌రో త్యాగ‌మూర్తుల ఫ‌లిత‌మే ఈ దేశం. దానిని కులాలు, మ‌తాలు, ప్రాంతాల పేరుతో విడ‌దీస్తున్నారు.

అందుకే భార‌త దేశానికి ద్వేషం కాదు ప్రేమ కావాల‌నే నినాదంతో ముందుకు వెళుతున్నా. ఇదిలా ఉండ‌గా రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేప‌ట్టిన జోడో యాత్ర ప్ర‌స్తుతం మ‌ధ్య ప్ర‌దేశ్ రాష్ట్ర‌లో కొన‌సాగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు త‌మిళ‌నాడులో ప్రారంభ‌మై కేర‌ళ‌, క‌ర్ణాట‌క‌, ఆంధ్ర ప్ర‌దేశ్ , తెలంగాణ‌, మ‌హారాష్ట్ర‌ల‌లో ముగిసింది.

మంగ‌ళవారం పాద‌యాత్ర సంద‌ర్భంగా రాహుల్ గాంధీ(Rahul Gandhi) మీడియాతో మాట్లాడారు. మీరు ఎవ‌రి కోసం ఈ యాత్ర చేస్తున్నార‌న్న ప్ర‌శ్న‌కు ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చారు. మీరే కాదు ఈ దేశంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ, దాని అనుబంధ సంస్థ‌లు, దానిని మోస్తున్న వారితో పాటు మోదీ, అమిత్ షా, జేపీ న‌డ్డా అంతా రోజూ నా నామ స్మ‌ర‌ణ‌తో మొద‌ల‌వుతుంద‌న్నారు.

దానిని తాను ఏమీ చేయ‌లేన్నారు. వాళ్ల హృద‌యాలు ద్వేషంతో నిండి పోయాయి. వాళ్ల‌కు అధికారం త‌ప్ప ఇంకేదీ క‌నిపించ‌డం లేద‌ని మండిప‌డ్డారు రాహుల్ గాంధీ.

ఈ పాద‌యాత్ర ద్వారా నేను ఎన్నో నేర్చుకున్నాను. ఇంకా నేర్చుకునేందుకు సిద్దంగా ఉన్నాన‌ని చెప్పారు. గ‌తంలో కొంత సేపు చికాకు ప‌డేవాడిని ..కానీ ఇప్పుడు ప్ర‌శాంతంగా ఉండ‌డం నేర్చుకున్నాన‌ని అన్నారు.

ప్ర‌స్తుతం రాహుల్ గాంధీని వ‌దిలేశాను. దేశం బాగుండాల‌ని ఒక వ్య‌క్తిగా ఈ యాత్ర చేస్తున్నాన‌ని స్ప‌ష్టం చేశారు రాహుల్ గాంధీ.

Also Read : బీజేపీ ఓట‌మి ఖాయం ఆప్ విజ‌యం త‌థ్యం

Leave A Reply

Your Email Id will not be published!