India: పాకిస్తాన్ కు భారత్ షాక్ ! జమ్మూకశ్మీర్ లో చేపట్టే ప్రాజెక్టుల్లో నిల్వ సామర్థ్యం పెంపు !
పాకిస్తాన్ కు భారత్ షాక్ ! జమ్మూకశ్మీర్ లో చేపట్టే ప్రాజెక్టుల్లో నిల్వ సామర్థ్యం పెంపు !
India: జమ్మూకశ్మీర్లో హైడ్రో పవర్ ప్రాజెక్టుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెంపుపై ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని కేంద్ర విద్యుత్తుశాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్ తెలిపారు. నిర్మాణ ప్రతిపాదనల్లో ఉన్న ప్రాజెక్టుల్లో అంతకుమించి ఇప్పుడు ఎటువంటి మార్పులు చేయడం లేదని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ … ‘‘సింధు జలాల ఒప్పందం విషయానికి వస్తే… ప్రతిపాదనల్లో ఉన్న ప్రాజెక్టుల్లో ఎటువంటి మార్పులు లేవు. ఎందుకంటే వీటి సాంకేతిక అంశాలు ఇప్పటికే నిర్ణయించేశారు. కొన్ని ప్రాజెక్టులు ప్రారంభ దశలోనే ఉన్నాయి. వాటిల్లో విద్యుత్తు ఉత్పత్తిని ఎక్కువగా చేసేందుకు మరింత నీటినిల్వ సామర్థ్యం పెంచవచ్చు’’ అని తెలిపారు.
India Shocking to Pakistan
ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం పాక్ తో ఉన్న సింధుజలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. వాస్తవానికి ఈ ఒప్పందం కారణంగానే ఇన్నాళ్లూ సింధు, దాని ఉప నదులపై భారత్(India) హైడ్రోఎలక్ట్రిక్ ప్లాంట్ల నిర్మాణం కష్టంగా మారింది. దీనితోపాటు నీటినిల్వ సామర్థ్యం పెంచడం కూడా ఇబ్బందికరంగా మారింది. కానీ, ఇప్పుడు ఒప్పందాన్ని నిలిపివేయడంతో… కొత్త ప్రాజెక్టులతో పాటు నీటి నిల్వను కూడా పెంచే అవకాశం లభించింది.
ప్రస్తుతం సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ జమ్మూకశ్మీర్లో నాలుగు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులను ఆమోదించింది. కానీ, ఇవి ఇంకా నిర్మాణ పనులను ప్రారంభించాల్సి ఉంది. వీటిల్లో సింధుపై న్యూ గందర్బాల్ ప్రాజెక్టు, చీనాబ్పై కిర్తాయ్-2, సవల్కోట్, జీలంపై ఉరి-1,2 ప్రాజెక్టులు సిద్ధమవుతున్నాయి. సింధు, దాని ఉపనదుల జలాలను పంచుకోవడానికి ప్రపంచబ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్(India), పాకిస్థాన్ల మధ్య ఒప్పందం కుదిరింది. దీనిపై 1960 సెప్టెంబరులో నాటి భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, పాకిస్థాన్ అధ్యక్షుడు అయూబ్ఖాన్ సంతకాలు చేశారు. ఒప్పందం ప్రకారం సింధు ఉప నదుల్లో తూర్పున పారే రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారతదేశానికి హక్కులు లభించాయి. వీటి సగటు వార్షిక ప్రవాహం 33 మిలియన్ ఎకరాల అడుగులు (ఎమ్ఏఎఫ్)గా ఉంది. సింధు నదితోపాటు దాని పశ్చిమ ఉపనదులైన జీలం, చీనాబ్లపై పాకిస్థాన్కు హక్కులు దక్కాయి. వీటి సామర్థ్యం 135 ఎంఏఎఫ్గా ఉంది. ఈ నదీ జలాల వినియోగ సమాచారాన్ని పంచుకోవడానికి ఒప్పందం కింద ఓ సహకార యంత్రాంగాన్ని నెలకొల్పారు.
Also Read : Minister Nara Lokesh: పొదిలిలో రాళ్లదాడి ఘటనపై మంత్రులు సీరియస్