Covid19 Updates : దేశంలో 3,962 కేసులు 22 మరణాలు
నిన్నటి కంటే ఇవాళ మరిన్ని
Covid19 Updates : నిన్నటి దాకా తగ్గుముఖం పట్టిన కరోనా మళ్లీ విజృంభిస్తోంది. భారత దేశంలో గడిచిన 24 గంటల్లో 3,962 కేసులు కొత్తవి నమోదయ్యాయి. నిన్నటి కంటే ఇవాళ్టితో పోల్చితే 6 శాతం ఎక్కువ. కరోనా కారణంగా చని పోయిన వారి సంఖ్య 22 మంది. దీంతో వీరితో కలుపుకుంటే ఇప్పటి వరకు దేశంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,31,606కి చేరింది. కేరళలోనే ఎక్కువ మంది చని పోవడం విశేషం.
ఇప్పటికే కేంద్రం అప్రమత్తమైంది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. వీలైతే బూస్టర్ డోస్ కూడా ఇవ్వాలని స్పష్టం చేసింది. అంతే కాకుండా ఆస్పత్రులలో మౌలిక వసతులు కల్పించాలని, బెడ్లు, ఆక్సిజన్ సిద్దంగా ఉంచాలని ఆదేశించింది.
ఇక క్రియాశీల కేసుల పరంగా చూస్తే 40,177 నుండి 36,244కు తగ్గాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇవాళ 22 మంది చని పోతే అందులో కేరళలోనే ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం విశేషం.
ఇక కరోనా కేసుల పరంగా చూస్తే మొత్తం సంఖ్య 4.49 కోట్లుగా నమోదైంది. దాదాపు 4,49,60,678 కేసులు ఉన్నాయి. మొత్తం ఇన్ఫెక్షన్లలో 0.08 శాతంగా ఉన్నాయి. జాతీయ కోవిడ్ రేటు 98.73 శాతంగా నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.
Also Read : ఖాకీల తీరుపై డీసీడబ్ల్యూ చీఫ్ కన్నెర్ర