IndiGo Flight: ఇండిగో విమానాన్ని ఢీకొట్టిన పక్షి ! తృటిలో తప్పిన పెను ప్రమాదం !

ఇండిగో విమానాన్ని ఢీకొట్టిన పక్షి ! తృటిలో తప్పిన పెను ప్రమాదం !

IndiGo : పాట్నా నుండి రాంచీకి వెళ్తుతున్న ఇండిగో ఎయిర్ బస్ కు పెను ప్రమాదం తప్పింది. 170 మంది ప్రయాణికులతో వెళుతున్న విమానాన్ని ఓ పక్షి ఢీకొట్టింది. అ‍యితే, పైలెట్‌ వెంటనే అప్రమత్తం కావడంతో ప్రయాణికులు సురక్షితంగా భయపడ్డారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…

IndiGo Flight

సోమవారం మధ్యాహ్నం 1.14 గంటల సమయంలో ఇండిగో(IndiGo) ఎయిర్‌బస్ 320 విమానం పాట్నా నుండి రాంచీకి రావాల్సి ఉంది. ఆ సమయంలో ఎయిర్‌బస్‌ 320ని ఓ పక్షి ఢీకొట్టింది. ఈ ఘటనలో విమానానికి పగుళ్లు ఏర్పడ్డాయి. ప్రమాదంతో అప్రమత్తమైన పైలెట్‌ చాకచక్యంగా ల్యాండింగ్‌ చేయాల్సిన ఎయిర్‌ పోర్టుకు కాకుండా సమీపంలో ఉన్న రాంచీ బిర్సా ముండా విమానాశ్రయంలో విమానాన్ని సురక్షితంగా దించారు. ఈ ఘటనలో 170 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

ఈ సందర్భంగా రాంచీలోని బిర్సా ముండా విమానాశ్రయ డైరెక్టర్ ఆర్ ఆర్ మౌర్య మాట్లాడుతూ… రాంచీ సమీపంలో ఇండిగో విమానాన్ని ఓ పక్షి ఢీకొట్టింది. ఈ సంఘటన జరిగినప్పుడు ఫ్లైట్‌ 3,000 నుండి 4,000 అడుగుల ఎత్తులో ఉంది. ఇండిగో విమానం పాట్నా నుండి రాంచీకి వస్తుండగా, పైలట్ ఇక్కడ అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది అని తెలిపారు. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని, పక్షి ఢీకొట్టడం వల్ల విమానానికి పగుళ్లు ఏర్పడ్డాయి. ఇంజనీర్లు నష్టాన్ని అంచనా వేస్తున్నారు’ అని అన్నారు. కాగా, ఈ ఘటనపై ఇండిగో ప్రతినిధులు అధికారికంగా స్పందించాల్సి ఉంది.

Also Read : Ex Minister Kakani : మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కేసు పై కీలక అప్డేట్

Leave A Reply

Your Email Id will not be published!