Kasireddy Narayan Reddy : బీఆర్ఎస్ కు షాక్ కసిరెడ్డి గుడ్ బై
విద్యా సంస్థల చైర్మన్ గా గుర్తింపు
Kasireddy Narayan Reddy : హైదరాబాద్ – తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయాలు మారుతున్నాయి. ప్రధానంగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి వలసలు పెరుగుతుండడం ఒకింత విస్తు పోయేలా చేశాయి. తాజాగా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ, ప్రముఖ విద్యా సంస్థల చైర్మన్ కసిరెడ్డి నారాయణ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది బీఆర్ఎస్ బాస్ ను విస్తు పోయేలా చేసింది.
Kasireddy Narayan Reddy Resigned BRS
కసిరెడ్డి నారాయణ రెడ్డికి(Kasireddy Narayan Reddy) కల్వకుర్తి నియోజకవర్గంలో మంచి పట్టుంది. ఆదివారం ఉన్నట్టుండి తాను గులాబీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఆ వెంటనే టీపీసీసీ చీఫ్ తమ ప్రాంతానికి చెందిన ఎనుముల రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు.
దీంతో తను కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖరారై పోయింది. ఇప్పటికే బీఆర్ఎస్ లో కీలకమైన పాత్ర పోషిస్తూ వచ్చిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు రాజీనామా చేశారు. ఆయన తన తనయుడు తో కలిసి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ప్రస్తుతం టికెట్లు దక్కని వారంతా పార్టీలను వీడుతున్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నుండి కసిరెడ్డి టికెట్ ను ఆశించారు. కానీ తనకు రాక పోవడంతో గుడ్ బై చెప్పారు.
Also Read : Anil Kumar Yadav : చంద్రబాబు..నారాయణ తోడు దొంగలు