Kaushal Kishore : నెహ్రూపై కౌశ‌ల్ కిషోర్ షాకింగ్ కామెంట్స్

ఆయ‌న సిగ‌రెంట్, డ్ర‌గ్స్ తీసుకున్నారు

Kaushal Kishore : కాంగ్రెస్ , భార‌తీయ జ‌న‌తా పార్టీల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. మ‌ధ్య‌ప్ర‌దేశ్ కు చెందిన మాజీ మంత్రి ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీని చంపాలంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ త‌రుణంలో బీజేపీఈకి చెందిన కేంద్ర మంత్రి కౌశ‌ల్ కిషోర్(Kaushal Kishore) తానేమీ త‌క్కువ కాదంటూ ఏకంగా భార‌త దేశానికి చెందిన మొద‌టి ప్ర‌ధాన‌మంత్రి దివంగ‌త జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ పై వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేశారు.

ఆయ‌నకు సిగ‌రెట్ తాగే అలవాటుంద‌ని, అంతే కాకుండా మ‌త్తు ప‌దార్థాలు కూడా తీసుకున్నారంటూ ఆరోప‌ణ‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. కేంద్ర మంత్రి చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు తీవ్ర చ‌ర్చ‌కు దారితీశాయి. అంతే కాదు జాతిపిత మ‌హాత్మా గాంధీ త‌న‌యుడు కూడా డ్ర‌గ్స్ తీసుకునే వారంటూ మ‌రో కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

న‌షా ముక్తి జాగ‌ర‌ణ్ అభియాన్ లో పాల్గొనేందుకు రాజ‌స్థాన్ కు వ‌చ్చారు. భ‌ర‌త్ పూర్ లో కేంద్ర మంత్రి అటు నెహ్రూ, ఇటు గాంధీ కుమారుడిపై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టింది కాంగ్రెస్ పార్టీ. పాల‌న చేతకాని వాళ్లే మ‌తాన్ని అడ్డం పెట్టుకుని ఇలాంటి కామెంట్స్ చేస్తారంటూ ఆరోపించింది.

గ‌తించిన వారిపై నోరు పారేసుకోవ‌డం బీజేపీకి అల‌వాటుగా మారిందని పేర్కొంది. ఇదిలా ఉండ‌గా కేంద్ర మంత్రి చాలా ఏళ్లుగా మ‌త్తు ప‌దార్థాల‌కు వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేస్తూ వ‌స్తున్నారు. వీటి కార‌ణంగా త‌న కొడుకును కోల్పోయాన‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు కౌశ‌ల్ కిషోర్.

Also Read : రైల్వేస్ ఆహారంపై 6 వేల ఫిర్యాదులు

Leave A Reply

Your Email Id will not be published!