Kavati Manohar Naidu: వైసీపీ నుంచి గుంటూరు మాజీ మేయర్ కావటి మనోహర్ సస్పెన్షన్
వైసీపీ నుంచి గుంటూరు మాజీ మేయర్ కావటి మనోహర్ సస్పెన్షన్
Kavati Manohar Naidu : గుంటూరు నగర మాజీ మేయర్, వైసీపీ నేత కావటి మనోహర్ నాయుడుపై ఆ పార్టీ సస్పెన్సన్ వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు రావడంతో మనోహర్ నాయుడును సస్పెండ్ చేస్తున్నట్లు వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. మనోహర్ తోపాటు రెండో డివిజన్ కార్పొరేటర్ మర్రి అంజలి, ఐదో డివిజన్ కార్పొరేటర్ యాట్ల రవికుమార్ను క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు పార్టీ అధ్యక్షుడు జగన్ సస్పెండ్ చేసినట్లు వైసీపీ వర్గాలు వెల్లడించాయి.
Kavati Manohar Naidu Suspended
కావటి మనోహర్ నాయుడు గత ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కొంతకాలం కిందటే గుంటూరు నగర మేయర్ పదవికి కూడా రాజీనామా చేశారు. అప్పటి నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.
Also Read : AP EAPCET 2025: ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల ! టాప్-10లో అబ్బాయిలదే హవా !