KCR: కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్ ? అందుకేనా తేదీ మార్పు ?
కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్ ? అందుకేనా తేదీ మార్పు ?
KCR : కాళేశ్వరం కమిషన్ విచారణకు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 5వ తేదీన తమ ఎదుట విచారణకు హాజరు కావాలని కాళేశ్వరం కమిషన్ కేసీఆర్కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాళేశ్వరం కమీషన్ ముందు విచారణకు హాజరుకావడానికి కేసీఆర్ సిద్ధపడినట్లు తెలుస్తోంది. అయితే ముందుగా కమీషన్ చెప్పినట్లు5వ తేదీన కాకుండా 11వ తేదీన హాజరుకావడానికి కేసీఆర్ సముఖత చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ విచారణకు మరింత సమయం కావాలని కమిషన్ చైర్మన్ను కేసీఆర్ కోరినట్లు సమాచారం.
KCR Comments
జూన్2 తెలంగాణ భవన్లో మాజీమంత్రి హరీష్రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవాలని భావించారు. కానీ అనివార్య కారణాలతో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే ఈనెల 9వ తేదీన కమిషన్ ముందు విచారణకు మాజీ మంత్రి హరీష్రావు హాజరుకానున్నారు. అయితే హరీష్రావు హాజరు తర్వాత పరిణామాలను బట్టి ఈనెల 11వ తేదీన విచారణకు వెళ్లాలా వద్దా అనే విషయంపై కేసీఆర్(KCR) నిర్ణయం తీసుకోనున్నారు.
కాళేశ్వరం కమిషన్ విచారణకు రాలేనని లేఖ రాయనున్న కేసీఆర్
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టుపై విచారణకు కమిషన్ వేసింది. జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో కాళేశ్వరం కమిషన్ ఇప్పటికే ప్రాజెక్టు కోసం పని చేసిన ముఖ్య అధికారులను ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ప్రాజెక్టు నిర్మాణం జరిగినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్, ఇరిగేషన్ శాఖ మంత్రిగా పని చేసిన హరీష్ రావు, ఆర్థిక శాఖ మంత్రిగా పని చేసిన ఈటెల రాజేందర్ కమిషన్ ముందు హాజరు కావాలని నోటీసులు అందజేసింది. ఈ నేపథ్యంలో ఆ తేదీన విచారణకు రాలేనని… బదులుగా మరో తేదీని కేటాయించాలని ఆయన ఇప్పుడు కమిషన్కు బదులు ఇచ్చారని సమాచారం. ఇతర కార్యక్రమాలు ఉండడంతో విచారణకు రాలేనని, కావాలంటే ఈ నెల 11వ తేదీన హాజరవుతానని ఆయన లేఖలో ప్రస్తావిస్తారని తెలుస్తోంది.
Also Read : Sikkim Landslide : సిక్కింలో మిలిటరీ క్యాంపుపై కొండచరియలు విరిగిపడి 3 జవాన్ల మృతి