Kishan Reddy : కేంద్ర మంత్రి పదవులపై సంచలన వ్యాఖ్యలు చేసిన కిషన్ రెడ్డి

మోదీ 3.0 కేబినెట్‌లో తెలంగాణకు చెందిన ఇద్దరు బీజేపీ ముఖ్య నేతలకు కేంద్ర మంత్రి పదవులు దక్కాయి...

Kishan Reddy : మోదీ 3.0 కేబినెట్‌లో తెలంగాణకు చెందిన ఇద్దరు బీజేపీ ముఖ్య నేతలకు కేంద్ర మంత్రి పదవులు దక్కాయి. తెలంగాణ భారతీయ జనతా పార్టీ నేత, సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి(Kishan Reddy), కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కేంద్ర మంత్రి వర్గంలో ఉన్నారు. ఈరోజు (ఆదివారం) సాయంత్రం 7.15 గంటలకు ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోదీతో పాటు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Kishan Reddy Comment

మోదీ 3.0 కేబినెట్‌లో తెలంగాణకు చెందిన ఇద్దరు బీజేపీ ముఖ్య నేతలకు కేంద్ర మంత్రి పదవులు దక్కాయి. తెలంగాణ భారతీయ జనతా పార్టీ నేత, సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కేంద్ర మంత్రి వర్గంలో ఉన్నారు. ఈరోజు (ఆదివారం) సాయంత్రం 7.15 గంటలకు ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోదీతో పాటు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ కూడా ప్రమాణం చేయనున్నారు. సామాన్య కూలీలుగా పనిచేస్తున్న ముగ్గురిని మంత్రులుగా చేసిన ఘనత భారతీయ జనతా పార్టీకి ఉందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటానని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఉద్ఘాటించారు. తెలంగాణలో వేలకోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. వచ్చే ఐదేళ్లలో మూడు లక్షల ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. దక్షిణ భారతదేశంలో పార్టీని బలోపేతం చేయడంపై కార్యకర్తలు దృష్టి సారించాలన్నారు. కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా వేడుకలు నిర్వహించాలన్నారు.

Also Read : PM Modi : ప్రధాని మోదీ కేబినెట్ లో స్థానం సంపాదించిన మాజీ మంత్రులు…

Leave A Reply

Your Email Id will not be published!