Kolkata Police: ఉద్రిక్తంగా మారిన కోల్కతాలో మాజీ టీచర్ల ర్యాలీ
ఉద్రిక్తంగా మారిన కోల్కతాలో మాజీ టీచర్ల ర్యాలీ
Kolkata Police : పశ్చిమబెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్(డబ్ల్యూబీఎస్ఎస్సీ) ద్వారా 2016లో నిర్వహించిన టీచర్ల , బోధనేతర సిబ్బంది నియామకాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని సీబీఐ విచారణలో తేటతెల్లం కావడంతో… ఆ నియామకాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు(Supreme Court) తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనితో సుప్రీంకోర్టు తీర్పుతో పశ్చిమ బెంగాల్ లో మొత్తం 25,753 మంది ఉపాధ్యాయులు, సిబ్బంది ఉద్యోగులు ఉద్యోగాలను కోల్పోయారు. దీనితో తమలో అర్హులైన వారిని శాశ్వత ప్రాతిపదికన తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మళ్లీ ఎంపిక పరీక్ష పెడతామంటూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారు పెద్ద ఎత్తున ర్యాలీ, రాస్తారోకో, ఆందోళనలు నిర్వహించారు.
Kolkata Police Arrest Teachers…
ఈ నేపథ్యంలో నిరసన తెలిపేందుకు సెక్రటేరియట్ వైపు ర్యాలీగా వెళ్తుండగా పోలీసులు అడ్డుకుని 100 మందిని అరెస్ట్ చేశారు. కోల్కతాలోని సెంట్రల్ పార్క్ వద్ద కూడా మరో 500 మంది మాజీ ఉపాధ్యాయులు ఇదే డిమాండ్తో ఆందోళన చేపట్టారు. అక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలో సాల్ట్లేక్, ఎస్ప్లనేడ్ల వద్ద వందలాది మంది టీచర్లు నిరసనకు దిగారు. సెక్రటేరియట్ వైపు వెళ్తున్న వీరిని పోలీసులు ఆపేశారు. తమ పరిస్థితిని వివరించేందుకు సీఎం మమతా బెనర్జీ అపాయింట్మెంట్ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. సాల్ట్లేక్ వద్ద 500 మంది మాజీ ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు.
అయితే, టీచర్లు షర్టులు తీసేసి ర్యాలీ చేపట్టడాన్ని పోలీసులు అనుమతించలేదు. కోల్కతా హైకోర్టు(Kolkata High Court) ఆదేశాలకు అనుగుణంగా సెంట్రల్ పార్క్ వద్ద నిరసన చేపట్టేందుకు వీరికి వీలు కల్పించారు. అయితే, ట్రాఫిక్ కు అంతరాయం కలిగించేందుకు యత్నించిన 50 మంది మాజీ టీచర్లను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మహిళా పోలీసులతో జరిగిన తోపులాటలో కాలికి గాయమైన ఓ మాజీ ఉపాధ్యాయినిని ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించామన్నారు.
రాష్ట్ర విద్యాశాఖ ప్రధాన కార్యాలయం వద్ద గత 22 రోజులుగా కొందరు బాధితులు నిరసన సాగిస్తున్నారు. 2016లో ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు చేపట్టిన ఎంపిక పరీక్షల్లో తీవ్ర స్థాయిలో అక్రమాలు జరిగాయని తేలడంతో సుప్రీంకోర్టు ఏప్రిల్ 3వ తేదీన మొత్తం 25,753 మంది టీచర్ల నియామకాలు చెల్లవంటూ సంచలన తీర్పు వెలువరించడం తెల్సిందే. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం గురువారం 40 వేల టీచర్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేసిన అనుభవమున్న టీచర్లకు ఈ పరీక్షలో అదనంగా మార్కులుంటాయని ప్రకటించింది. అయితే వారు తమలో అర్హులైన వారిని శాశ్వత ప్రాతిపదికన తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Also Read : YSRCP Leaders: వెన్నుపోటు దినం పోస్టర్ ఆవిష్కరించిన వైసీపీ నేతలు