Kotamreddy Sridhar Reddy : భద్రత తొలగిస్తే భయపడతానా
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కామెంట్స్
Kotamreddy Sridhar Reddy : నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఆయన మరోసారి ఏపీ సీఎంను టార్గెట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తనను కావాలని టార్గెట్ చేస్తోందంటూ ధ్వజమెత్తారు. ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనకు ఉన్న నలుగురు గన్ మెన్లలో ఇద్దరిని తొలగించింది. అయితే తనకు మిగిలిన ఇద్దరు గన్ మెన్లు అక్కర్లేదంటూ ప్రకటించారు. జగన్ సర్కార్ కు రిటర్న్ గిఫ్ట్ తప్పక ఇస్తానని హెచ్చరించారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి(Kotamreddy Sridhar Reddy).
ఇదిలా ఉండగా తాను వైసీపీకి దూరం అవుతున్నానని ప్రకటించగానే తనకు లెక్కలేనన్ని బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేనా మీ రాజకీయం అంటూ నిలదీశారు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి. తనకు సెక్యూరిటీ తొలగించి చంపుదామని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు సీఎం జగన్ రెడ్డిని.
భద్రతను తగ్గించినంత మాత్రాన తాను భయపడనని హెచ్చరించారు ఎమ్మెల్యే. ఈ సమయంలో సెక్యూరిటీని పెంచాల్సింది పోయి తగ్గించడంలో అర్థం ఏమిటని, దాని వెనుక కుట్ర ఏముందో బయట పెట్టాలని సవాల్ విసిరారు.
సెక్యూరిటీ పేరుతో తనను భయ పెట్టాలని చూస్తున్నారని కానీ తన మద్దతుదారులు, అభిమానులే తనకు ఎళ్లవేలలా రక్షణగా ఉంటారని అన్నారు. ఇప్పటి వరకు నలుగురు ఉండే వారు. ఉన్న ఇద్దరినీ పక్కన పెట్టింది. మరో ఇద్దరు ఇంకెందుకు దండగ అని తానే పంపించానని అన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. తాను రిటర్న్ గిఫ్ట్ ఇలా ఇచ్చానని పేర్కొన్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే.
Also Read : అన్నామలైకి కీలక బాధ్యతలు