KS Bhagwan Sri Rama : శ్రీ‌రాముడిపై కామెంట్స్ క‌ల‌కలం

క‌న్న‌డ ర‌చ‌యిత కేఎస్ భ‌గ‌వాన్

KS Bhagwan Sri Rama : క‌ర్ణాట‌క‌లో ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం వేడిని రాజేస్తోంది. ఈ త‌రుణంలో ప్ర‌ముఖ కన్న‌డ ర‌చ‌యిత కేఎస్ భ‌గ‌వాన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కోట్లాది మంది హిందువులు ఆరాధించే శ్రీ‌రాముడి గురించి చ‌వ‌క‌బారు వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. దైవంగా భావించే రాముడు ఎలా ఆద‌ర్శంగా ఉండ‌గ‌ల‌డ‌ని ప్ర‌శ్నించారు.

సీత‌ను అడ‌విలోకి పంపిన శ్రీ‌రాముడును ఎలా పూజిస్తారంటూ నిల‌దీశాడు. అంతే కాదు చెట్టు కింద త‌ప‌స్సులో కూర్చున్న శూద్రుడి త‌ల‌ను న‌రికాడంటూ మండిప‌డ్డారు కేఎస్ భ‌గ‌వాన్. ఇదిలా ఉండ‌గా క‌న్న‌ర ర‌చ‌యిత గ‌తంలో మైసూర్ యూనివ‌ర్శిటీ నుండి ప్రొఫెస‌ర్ గా ప‌ద‌వీ విర‌మ‌ణ పొందారు.

హిందూత్వ సంస్థ‌ల‌ను ఆయ‌న టార్గెట్ చేస్తూ వ‌చ్చారు. ప్ర‌ముఖ హేతువాదిగా గుర్తింపు పొందారు. తాజాగా వాల్మీకీ రామాయ‌ణం గురించి ప్ర‌స్తావించారు. రాముడు త‌న భార్య స‌తీతో కూర్చుని మ‌ధ్యాహ్నం మ‌ద్యం సేవించాడ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణలు చేశారు. క‌ర్ణాట‌క‌లోని మాండ్యా లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో కేఎస్ భ‌గ‌వాన్(KS Bhagwan Sri Rama) మాట్లాడారు.

శ్రీ‌రాముడు త‌న భార్య‌ను అడ‌వికి పంపాక అస్స‌లు ప‌ట్టించు కోలేద‌ని మండిప‌డ్డారు. శూద్రుడిని త‌ల న‌రికిన రాముడు ఎలా ఆద‌ర్శ ప్రాయంగా ఉంటాడో మీరే చెప్పాల‌న్నారు. రామ రాజ్య నిర్మాణం గురించి చ‌ర్చ జ‌రుగుతోంది. వాల్మీకి రామాయణంలోని ఉత్త‌ర కాండ‌ను చ‌దివితే రాముడు ఆద‌ర్శంగా లేడ‌న్న‌ది అర్థం అవుతుంద‌న్నారు కేఎస్ భ‌గ‌వాన్.

ఇదిలా ఉండ‌గా కేఎస్ భ‌గ‌వాన్ చేసిన కామెంట్స్ పై భార‌తీయ జ‌న‌తా పార్టీ, దాని అనుబంధ సంస్థ‌లు, సంఘాలు, నాయ‌కులు భ‌గ్గుమంటున్నారు. ఇది హిందూత్వ మ‌తంపై కావాల‌ని జ‌రుగుతున్న దాడిగా పేర్కొన్నారు.

Also Read : అంబురం నాగోబా జాత‌ర సంబురం

Leave A Reply

Your Email Id will not be published!