KTR : తెలంగాణలో ఎన్నికలు ఇంకా రానే లేదు. కానీ వాతావరణం మాత్రం పూర్తిగా మారి పోయింది. ఇప్పటికే సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు పార్టీ శ్రేణులను. అప్రమత్తంగా ఉండాలని, ఈ ఆరు నెలలు అత్యంత కీలకమని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా పార్టీ తీసుకున్న సంచలన నిర్ణయాలు, సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకు పోవాలని పిలుపునిచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR).
KTR Instructs
పార్టీ పరంగా ప్రతి ఒక్కరు ఈ విజయాలను ఆకళింపు చేసుకోవాలని, వారికి అర్థం అయ్యేలా చెప్పాలని సూచించారు. దేశంలో ఎక్కడా లేనన్ని సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను కేసీఆర్ సర్కార్ అమలు చేస్తోందన్నారు. బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనన్నారు. వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేయడం, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం, నగరంలో మెట్రా భారీ విస్తరణ వంటి అంశాలను ప్రధానంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని, ఎక్కడికక్కడ సంబురాలు చేయాలని కోరారు కేటీఆర్. అనాధల పాలసీని తీసుకు వచ్చిన ఘనత బీఆర్ఎస్ దేనని పేర్కొన్నారు.
మంగళవారం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ జనరల్ సెక్రటరీలు, జిల్లా పార్టీ అధ్యక్షులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. 21 వేల మంది వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం జరిగిందన్నారు. ఆర్టీసీని విలీనం చేయడం వల్ల 43 వేల మందికి పైగా సిబ్బందికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. కొత్తగా ఎయిర్ పోర్టు, 8 మెడికల్ కాలేజీలను కూడా మంజూరు చేసిన ఘనత సీఎం కేసీఆర్ దేనని పేర్కొన్నారు కేటీఆర్.
Also Read : MP Sanjay Singh : కేంద్రం రాజ్యాంగ విరుద్దం – సంజయ్ సింగ్