KTR: మేడిగడ్డ బ్యారేజీ డ్రోన్ కేసులో కేటీఆర్‌కు బిగ్ రిలీఫ్

మేడిగడ్డ బ్యారేజీ డ్రోన్ కేసులో కేటీఆర్‌కు బిగ్ రిలీఫ్

KTR : మేడిగడ్డ బ్యారేజీపై డ్రోన్ ఎగురవేసిన కేసులో సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ పై నమోదైన కేసును తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. ఉట్నూరు పోలీస్‌స్టేషన్‌ లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది సెప్టెంబర్‌ లో కేటీఆర్‌పై ఉట్నూరు పీఎస్‌ లో కేసు నమోదు అయింది. కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును ఛాలెంజ్ చేస్తూ కేటీఆర్ తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి న్యాయస్థానంలో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ఇరువైపుల వాదనలు విన్న జస్టిస్ కె.లక్ష్మణ్ బెంచ్‌ కేటీఆర్‌పై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

KTR Get Relief from Medigadda Case

మేడిగడ్డ బ్యారేజీపై డ్రోన్ ఎగురవేశారనే కారణంతో కేటీఆర్(KTR) సహా మరికొంతమందిపై మహదేవ్‌పూర్ పోలీస్టేషన్‌లో కేసు నమోదైంది. ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే, ఈ కేసును సవాల్ చేస్తూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. గత కొంతకాలంగా ఈ వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. సోమవారం కూడా కోర్టులో విచారణ జరిగింది. మేడిగడ్డ బ్యారేజీ నిషిద్ధ ప్రాంతమేమీ కాదని కేటీఆర్ తరఫు న్యాయవాది టీవీ రమణారావు వాదించారు. రాజకీయ కక్షతనే కేసు నమోదు చేశారని న్యాయవాది టీవీ రమణ కోర్టుకు తెలిపారు. దీనికి రియాక్ట్ అయిన పబ్లిక్ ప్రాసిక్యూటర్… డ్రోన్ ఎగురవేయడం డ్యామ్ భద్రతకే ప్రమాదమన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం… కేటీఆర్‌పై మహదేవ్‌పూర్ పోలీసులు నమోదు చేసిన కేసులను కొట్టేసింది. ఈ మేరకు తీర్పు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ధర్మాసనం.

మేడిగడ్డ బ్యారేజీ కూలిపోయిందంటూ… బీఆర్ఎస్ అవినీతికి ఇదే నిదర్శనం అంటూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కేటీఆర్… తమ పార్టీ నేతలతో కలిసి జూన్‌ లో భూపాలపల్లి జిల్లా మహదేవ్‌​పూర్ మండలంలోని మేడిగడ్డ(Medigadda) బ్యారేజీని సందర్శించారు. ఆ టైమ్ లో బీఆర్ఎస్ కార్యకర్తలు కొందరు డ్రోన్ ఎగురవేసి మేడిగడ్డ బ్యారేజీ వీడియోలు తీశారు. ఆ వీడియోలను యూట్యూబ్, ఫేస్ బుక్, ఎక్స్ తదితర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌లో అప్ లోడ్ చేశారు. దాంతో అవి కాస్తా వైరల్ అయ్యాయి. ఈ వీడియోలను పోస్ట్ చూస్తే… మేడిగడ్డ బ్యారేజీకి ఏం కాలేదని, పెద్ద ఎత్తున వరద వచ్చినా తట్టుకున్నదని, ప్రభుత్వం కావాలనే మేడిగడ్డపై రాజకీయం చేస్తుందని ప్రచారం చేశారు. అయితే, డ్రోన్ కెమెరాతో వీడియో చిత్రీకరణకు బీఆర్ఎస్ ముందస్తు అనుమతి తీసుకోలేదంటూ ఇరిగేషన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు కేటీఆర్, బాల్క సుమన్, గండ్ర వెంకటరమణా రెడ్డి సహా పలువురిపై మహదేవ్‌పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Also Read : Wife: భర్తను కరెంట్‌ షాక్‌ తో చంపి పూడ్చిపెట్టిన భార్య

Leave A Reply

Your Email Id will not be published!