KTR: గురువారం ‘కాళేశ్వరం’ సందర్శనకు బీఆర్ఎస్ బృందం. !

గురువారం 'కాళేశ్వరం' సందర్శనకు బీఆర్ఎస్ బృందం. !

KTR: గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం గురువారం సందర్శించనున్నారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే ఈ బృందం సందర్శనకు బయలుదేరనుంది. అసెంబ్లీ నుంచే నేరుగా ప్రత్యేక బస్సులో వెళ్లి కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా ఎల్.ఎం.డీ రిజర్వాయర్ సందర్శించనున్న బీఆర్ఎస్ బృందం గురువారం రాత్రి రామగుండంలో బస చేయనుంది.

KTR Visit

అనంతరం శుక్రవారం ఉ .10 గం.లకు కన్నెపల్లి పంపు హౌజ్ ను సందర్శించనున్నారు. 11 గం.లకు మేడిగడ్డ బ్యారేజ్ వద్ద పరిస్థితిని పరిశీలించనున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను ఈ సందర్శన ద్వారా బి.ఆర్.ఏస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం తిప్పికొట్టనుంది. అనంతరం శుక్రవారం సాయంత్రానికి బి.ఆర్.ఏస్
బృందం హైదరాబాద్ తిరిగిరానుంది.

Also Read : Home Minister Anitha : ఏపీలో ఫేక్ రాజకేయం ఫేక్ ప్రచారం మాత్రమే వైసీపీ సిద్ధాంతం

Leave A Reply

Your Email Id will not be published!