IAS Mahabharathi : పోక్సో కేసుపై తమిళనాడు కలెక్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు
పోక్సో కేసుపై తమిళనాడు కలెక్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు
Mahabharathi : పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడే వారికి కఠినమైన శిక్షలు విధించే విధంగా అమలులోనికి తీసుకువచ్చిన పోక్సో చట్టం విషయంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ప్రతిష్టాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ఆర్ధిక, రాజకీయ, సామాజిక పలుకుబడికి అతీతంగా నిందితులకు శిక్షను వేసే విధంగా పోలీసులు, న్యాయవ్యవస్థ పనిచేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో ఈ పోక్సో చట్టంపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విసృతమైన ప్రచారం చేస్తున్నాయి. అంతేకాదు ఈ పోక్సో చట్టం అమలుకు తమవంతు సహాయం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల నమోదైన ఓ పోక్సో కేసు విషయంలో తమిళనాడు(Tamil Nadu)లోని మైలాడుదురై జిల్లా కలెక్టర్ మహాభారతి(Mahabharathi) సంచలన వ్యాఖ్యలు చేసారు. కలెక్టర్ మహాభారతి వ్యాఖ్యలపై కంగుతిన్న తమిళనాడు ప్రభుత్వం అతనిపై బదిలీ వేటు వేసింది. అతని స్థానంలో ఈరోడ్ కార్పొరేషన్ కమిషనర్ హెచ్ఎస్ శ్రీకాంత్ ను నూతన కలెక్టర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…
IAS Mahabharathi Sensational Comments
తమిళనాడులోని మైలాడుదురై జిల్లా సీర్గాళిలో గతనెల 24న అంగన్వాడీ కేంద్రానికి వెళ్లిన మూడున్నరేళ్ల చిన్నారిపై 16 ఏళ్ల బాలుడు లైంగిక వేధింపులకు పాల్పడి, తీవ్రంగా గాయపరిచాడు. బాలిక పరిస్థితి విషమంగా ఉంది. ఈ దారుణానికి పాల్పడిన బాలుడిని పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. దీనితో నిందితుడిపై పోక్సో చట్టం క్రింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపధ్యంలో బాలల భద్రతపై నిర్వహించిన నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టరు మహాభారతి సీర్గాళి అత్యాచారం కేసును ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటువంటి కేసుల్లో అధికారులు రెండువైపులా ఆలోచించాలని అన్నారు. బాలిక అతడిపై ఉమ్మేయడంతోనే ఆగ్రహానికి గురై లైంగిక వేధింపులకు గురిచేసి తీవ్రంగా గాయపరిచాడని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో… తమిళనాట రాజకీయంగా సంచలనం రేపింది.
ఈ నేపధ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై కలెక్టర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆదర్శవంతమైన స్థానంలో ఉన్నవారు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. అదేసయంలో డీఎంకే ఎంపీ కనిమొళి కూడా కలెక్టర్ పై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ మహాభారతి వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వస్తుండడంతో ప్రభుత్వం నష్ట నివారణా చర్యలను ప్రారంభించింది. దీనిలో భాగంగా కలెక్టర్ మహాభారతిపై బదిలీ వేటు వేసింది.
Also Read : Uttarakhand: ఉత్తరాఖండ్ ఘటనలో 46 మంది సేఫ్ ! నలుగురు మృతి !