Mahua Moitra Rahul : రాహుల్ కామెంట్స్ మ‌హూవా సీరియ‌స్

బీజేపీని గెలిపించేందుకు టీఎంసీ పోటీ

Mahua Moitra Rahul : మేఘాల‌య లోని షిల్లాంగ్ లో జ‌రిగిన ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్న కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు రాహుల్ గాంధీ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కేంద్రంలోని మోదీ స‌ర్కార్ పై, బీజేపీపై మండిప‌డ్డారు. కాషాయ పార్టీని గెలిపించేందుకే మ‌మ‌తా బెన‌ర్జీ సార‌థ్యంలోని టీఎంసీ ఎన్నిక‌ల బ‌రిలో నిలిచింద‌ని ఆరోపించారు. ఈ సంద‌ర్బంగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్య‌ల‌పై సీరియ‌స్ గా స్పందించారు టీఎంసీ ఎంపీ మ‌హూవా మోయిత్రా(Mahua Moitra Rahul).

ముందు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడి పోతోందోన‌న్న విష‌యం ఆలోచించాల‌ని సూచించారు. త‌మ పార్టీని అన‌డం కంటే ఆత్మ ప‌రిశీల‌న చేసుకుంటే బెట‌ర్ అని పేర్కొన్నారు మ‌హూవా మోయిత్రా. రాష్ట్రంలో కాంగ్రెస్ ఓడి పోతూనే మ‌రో సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీ గెలుపొంద‌డాన్ని మ‌నం ఇంట్లో కూర్చుని చూడాలా అని ప్ర‌శ్నించారు. బీజేపీతో తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంద‌న్న రాహుల్ గాంధీ ఆరోప‌ణ‌ల్లో వాస్త‌వం లేద‌న్నారు.

బీజేపీకి కాంగ్రెస్ పార్టీ ఎన్న‌టికీ ప్ర‌త్యామ్నాయం కాద‌ని టీఎంసీ పార్టీ మాత్ర‌మే ప్ర‌త్యామ్నాయం అని స్ప‌ష్టం చేశారు ఎంపీ మ‌హూవా మోయిత్రా. ఉత్త‌ర షిల్లాంగ్ నుండి త‌మ పార్టీ అభ్య‌ర్థిగా బ‌రిలో దిగిన ఎల్గివా గ్వినేత్ రింజాకు మద్ద‌తుగా ఆమె ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నారు.

రాష్ట్రాన్ని గెలుచు కోవ‌డంలో కాంగ్రెస్ విఫ‌ల‌మైంది. దానిని ఎలా అధిగ‌మించాలో తెలియ‌క రాహుల్ గాంధీ పునరాలోచ‌న‌లో ప‌డ్డారంటూ ఎద్దేవా చేశారు మ‌హూవా మోయిత్రా. మ‌హిళ‌లు త‌మ విలువైన ఓటును టీఎంసీ అభ్య‌ర్థికి వేయాల‌ని ఆమె పిలుపునిచ్చారు.

Also Read : ప్లీన‌రీ స‌మావేశానికి ‘గాంధీలు’ దూరం

Leave A Reply

Your Email Id will not be published!