Mallikarjun Kharge : ప్రధాని మోదీకి ఆ అంశంపై ఖర్గే కీలక లేఖ
స్పీకర్ తర్వాత లోక్సభలో రెండో అత్యున్నత పదవి డిప్యూటీ స్పీకర్దేనని ఆయన గుర్తు చేశారు...
Mallikarjun Kharge : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఈ రోజు (మంగళవారం) ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) లేఖ రాశారు. లోక్సభలో డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉన్న విషయంపై ఆయన ప్రధానమంత్రికు లేఖ ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు.
Mallikarjun Kharge Letter to Modi
డిప్యూటీ స్పీకర్ నియామకం ఆలస్యం కావడాన్ని తీవ్రంగా విమర్శించిన ఖర్గే, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 93 ప్రకారం డిప్యూటీ స్పీకర్ను ఎన్నుకోవడం తప్పనిసరి అని పేర్కొన్నారు. స్పీకర్ తర్వాత లోక్సభలో రెండో అత్యున్నత పదవి డిప్యూటీ స్పీకర్దేనని ఆయన గుర్తు చేశారు.
ప్రతి కొత్త లోక్సభ రెండో లేదా మూడో సెషన్లో డిప్యూటీ స్పీకర్ను ఎన్నుకోవడం ఓ సంప్రదాయమని, మొదటి నుంచి పదహారో లోక్సభ వరకూ అన్ని లోక్సభల్లో ఈ పదవికి వారు ఉన్నారన్నదాన్ని ఆయన వివరించారు. కానీ 17వ మరియు 18వ లోక్సభల్లో మాత్రం ఈ పదవి ఖాళీగా ఉండటం అసాధారణమని ఖర్గే విమర్శించారు.
ఇది ప్రజాస్వామ్య సూత్రాలకు వ్యతిరేకమని, ప్రధాన ప్రతిపక్షానికి ఈ పదవి కట్టబెట్టడం అనేది గతంలో పాటించిన నియమమని ఖర్గే అన్నారు. ఈ స్థానం ఖాళీగా ఉండడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన అభిప్రాయపడ్డారు. వెంటనే డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ప్రక్రియను ప్రారంభించాలని ప్రధానమంత్రి మోదీకి మల్లికార్జున ఖర్గే విజ్ఞప్తి చేశారు.
Also Read : PSR Anjaneyulu : ఐపీఎస్ పీఎస్ఆర్ కు అస్వస్థత..విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స