Marri Rajasekhar: వైసీపీకు బిగ్ షాక్‌ ! ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌ రాజీనామా !

వైసీపీకు బిగ్ షాక్‌ ! ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌ రాజీనామా !

Marri Rajasekhar : వైసీపీకు బిగ్ షాక్‌ తగిలింది. పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌… తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. శాసన మండలి ఛైర్మన్ కొయ్యే మోషేనురాజును కలిసి తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఎమ్మెల్సీగా మర్రి రాజశేఖర్(Marri Rajasekhar) పదవీకాలం 2029 వరకూ ఉంది. అయినప్పటికీ తన పదవికి రాజీనామా చేసి… త్వరలో ఆయన తెదేపాలో చేరనున్నట్లు సమాచారం. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్సీలు వైసీపీను వీడారు. వారిలో జయమంగళ వెంకటరమణ, పోతుల సునీత, బల్లి కల్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ ఉన్నారు. చిలకలూరిపేట వైకాపా ఇన్‌ఛార్జ్‌గా మాజీ మంత్రి విడదల రజనీని నియమించడంతో మర్రి రాజశేఖర్‌ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే బుధవారం రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

Marri Rajasekhar Resign

ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌ రాజీనామా చేస్తున్నట్లు తెలిసిన వెంటనే పలువురు వైసీపీ(YSRCP) నేతలు అసెంబ్లీ లాబీలో ఆయనతో మాట్లాడేందుకు యత్నించారు. రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కోరారు. అయితే తాను ఇప్పటికే తాను నిర్ణయం తీసుకున్నానని వైసీపీ నేతలకు మర్రి రాజశేఖర్ తేల్చి చెప్పినట్లు సమాచారం. చిలకలూరిపేట ఇన్‌చార్జిగా విడదల రజనీని నియమించడం పట్ల మర్రి రాజశేఖర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. రజనీని వైసీపీ ఇన్‌చార్జిగా నియమించిన నాటి నుంచి వైసీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. వైవీ సుబ్బారెడ్డి, అయోద్యరామిరెడ్డి బుజ్జగించినప్పటికి ఆయన అసంతృప్తిలోనే ఉన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఘోరంగా ఓడిపోయిన రజనీని మరల చిలకలూరిపేట ఇన్‌చార్జిగా ఎలా నియమిస్తారని రాజశేఖర్ ప్రశ్నించారు. చివరకు వైసీపీకి గుడ్‌బై చెప్పేయాలని నిర్ణయించుకున్న ఆయన.. రాజీనామా పత్రాన్ని మండలి చైర్మన్‌కు అందజేశారు.

త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ – మర్రి

శాసనమండలి లాబీలో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మర్రి రాజశేఖర్(Marri Rajasekhar) మాట్లాడుతూ… ప్రస్తుతానికి ఎమ్మెల్సీగా రాజీనామా చేసినట్లు తెలిపారు. వెంటనే ఆమోదించాలని కూడా చైర్మన్‌ను కోరానన్నారు. ఇప్పుడు చిలకలూరిపేట వెళ్లి వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్లు చెప్పారు. కార్యకర్తలతో మాట్లాడాక భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. ఆ తర్వాత రాజీనామాకు గల కారణాలపై అన్ని విషయాలు వెల్లడిస్తానని మర్రి రాజశేఖర్ తెలిపారు.

రాజీనామాల ఆమోదానికి ఎమ్మెల్సీల ఒత్తిడి ?

ఇదిలా ఉండగా.. ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసిన ముగ్గురు ఎమ్మెల్సీలు… చైర్మన్‌ను కలిసి రాజీనామాలను ఆమోదించాలని డిమాండ్ చేశారు. బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, జయమంగళం వెంకట రమణ వైసీపీకి గుడ్‌బై చెప్పేయగా… ఇంతవరకు వారి రాజీనామాను చైర్మన్ ఆమోదించలేదు. దీనితో ఈరోజు టీ బ్రేక్‌లో చైర్మన్‌ ను కలిసిన ముగ్గురు ఎమ్మెల్సీలు తమ రాజీనామాను ఆమోదించాలన్నారు. దీనిపై స్పందించిన చైర్మన్ త్వరలోనే పరిశీలిస్తామని చెప్పారు. అయితే తమ రాజీనామాలను ఆమోదించాల్సిందేనని ఎమ్మెల్సీలు పట్టుబట్టారు.

Also Read : Metro Rail: విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్లాన్‌ రూపకల్పనకు కేంద్రం నిధులు

Leave A Reply

Your Email Id will not be published!