Mehul Choksi: బెల్జియంకు పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ
బెల్జియంకు పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ
Mehul Choksi : సుమారు 13 వేల కోట్ల రూపాయలు అప్పుతీసుకుని పంజాబ్ నేషనల్ బ్యాంకుకు కుచ్చుటోపీ పెట్టిన ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ… బెల్జియంకు పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బెల్జియం నుండి మెహుల్ చోక్సీను భారత్ కు రప్పించేందుకు అధికారులు సిద్ధమౌతున్నారు. దీనిలో భాగంగానే ప్రభుత్వం… బెల్జియంలోని సంబంధిత అధికారులను సంప్రదించింది. వేలకోట్లు మోసం చేసి… ఆంటిగ్వా-బార్బుడా పౌరసత్వం తీసుకున్న మెహుల్ చోక్సీ(Mehul Choksi)… ఈ మధ్య కాలంలోనే బెల్జియం వెళ్ళాడు. తన భార్య ప్రీతి… బెల్జియన్ పౌరురాలు అని తెలుస్తోంది. దీనితో చోక్సీ కూడా అక్కడ రెసిడెన్సీ కార్డ్ పొందినట్లు సమాచారం. బెల్జియన్ నివాసం కోసం తప్పుడు పత్రాలు ఉపయోగించారని చోక్సీపై ఆరోపణలు ఉన్నాయి.
Mehul Choksi Escape
నిజానికి పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన సంఘటన వెలుగులోకి వచ్చిన తరువాత… చోక్సి, నీరవ్ మోదీ దేశం విడిచి పారిపోయారు. ఛోక్సీ ఆంటిగ్వా-బార్బుడాకు పారిపోగా… నీరవ్ మోదీ బ్రిటన్ జైలులో ఉన్నాడు. వీరిని భారత్కు రప్పించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇటీవల భారత్ పర్యటనకు వచ్చిన ఆంటిగ్వా-బార్బుడా విదేశాంగ మంత్రి ఈపీ ఛెత్ గ్రీన్ మాట్లాడుతూ… మెహుల్ ఛోక్సీ ప్రస్తుతం తమ దేశంలో లేరని, వైద్యం కోసం విదేశాలకు వెళ్లినట్లు తెలిసిందని వెల్లడించారు. ప్రస్తుతం చోక్సి విదేశాల్లో ఉన్నప్పటికీ.. భారతదేశ పౌరసత్వాన్ని వదులుకోలేదు.
ఇక లండన్ జైలులో ఉన్న నీరవ్ మోదీకి బెయిల్ ఇవ్వడంపై కోర్టులు పదే పదే నిరాకరించడంతో.. తనను భారతదేశానికి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నాడు. మెహుల్ ఛోక్సీని బెల్జియం అధికారులు.. భారత ప్రభుత్వానికి అప్పగిస్తారా?.. లేదా? అనే విషయాలు తెలియాల్సి ఉంది.
Also Read : YSRCP Leader: లింగాపురంలో వైసీపీ కార్యకర్త దారుణ హత్య