Minister KTR : అలంపూర్ గులాబీ అభ్యర్థి మార్పు
పార్టీ అభ్యర్థి మార్చిన బీఆర్ఎస్
Minister KTR : హైదరాబాద్ – తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న వేళ అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహంకు కోలుకోలేని షాక్ తగిలింది. ఇప్పటికే బీఆర్ఎస్ బాస్ , సీఎం కేసీఆర్ మొత్తం 119 నియోజకవర్గాలకు సంబంధించి 115 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేశారు. ఇందులో అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం కూడా ఉన్నారు.
Minister KTR Comment
ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుండి సంపత్ కుమార్ బరిలో ఉన్నారు. ఇక్కడి నుంచి గతంలో ఎమ్మెల్యేగా ఉన్న చల్లా వెంకట్రామి రెడ్డి ఇటీవలే గులాబీ కండువా కప్పుకున్నారు. ఆ వెంటనే ఆయనకు ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇచ్చారు. అలంపూర్ లో ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నా చల్లాదే హవా నడుస్తుంది.
దీంతో అబ్రహంకు కాదని కొత్తగా బీఆర్ఎస్ విజేయుడికి టికెట్ ను ఖరారు చేసింది. ఇక్కడ హోరా హోరీగా పోరు నడుస్తోంది. దీంతో ఎమ్మెల్యే పట్ల ఉన్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. అబ్రహంకు షాక్ ఇచ్చింది. సీఎం ఆదేశాల మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీ రామారావు(Minister KTR) ప్రగతి భవన్ లో బి ఫారమ్ అందజేశారు. దీంతో విజేయుడు బరిలో ఉన్నారు.
Also Read : Teenmar Mallanna : కాంగ్రెస్ గూటికి తీన్మార్ మల్లన్న