Minister Nara Lokesh: పొదిలిలో రాళ్లదాడి ఘటనపై మంత్రులు సీరియస్

పొదిలిలో రాళ్లదాడి ఘటనపై మంత్రులు సీరియస్

Nara Lokesh : ప్రకాశం జిల్లా పొదిలిలో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ బుధవారం పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వైఎస్ జగన్ కు పొదిలి ప్రజల నుండి ఘన స్వాగతం లభించింది. అదే సమయంలో అమరావతి ప్రాంత మహిళలపై సాక్షి టీవీ ఛానెల్ వేదికగా చేసిన అనుచిత వ్యాఖ్యలపై మండిపడుతూ… మహిళలు పెద్ద ఎత్తున జగన్(YS Jagan) పర్యటనలో నిరసన వ్యక్తం చేసారు. జగన్ కాన్వాయ్ వెళ్తున్న మార్గంలో నల్ల బెలూన్లు ఎగురవేస్తూ… ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ… జగన్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేసారు. దీనితో వైసీపీ కార్యకర్తలు… నిరసన తెలుపుతున్న మహిళలు, బందోబస్తులో ఉన్న పోలీసులపై రాళ్ళ దాడికి దిగారు. ఈ దాడిలో కొంతమంది మహిళలు, పోలీసులు గాయపడ్డారు.

Nara Lokesh – వైసీపీ సైకోల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా – మంత్రి లోకేశ్

అయితే పొదిలిలో ప్రజస్వామ్య బద్ధంగా నిరసన తెలుపుతున్న మహిళలపై రాళ్ళ దాడికి దిగడంపై ఏపీ మంత్రులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పొదిలిలో వైసీపీ సైకోల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మంత్రి నారా లోకేశ్‌(Nara Lokesh) తెలిపారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలపై దాడి చేస్తారా అని ప్రశ్నించారు. రాళ్లదాడి చేసిన దుర్మార్గులను కఠినంగా శిక్షిస్తామన్నారు. ‘‘జగన్‌ మొన్న తెనాలి గంజాయి బ్యాచ్‌ రౌడీషీటర్లకు ఓదార్పు యాత్ర చేశారు. ఇప్పుడేమో మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన వారికి మద్దతిస్తున్నారు. సొంత తల్లి, చెల్లిని బయటకు గెంటేసి.. కోర్టుకు ఈడ్చారు. పొదిలిలో వైసీపీ చేసిన దాడికి జగన్‌ క్షమాపణ చెప్పాలి’’ అని లోకేశ్‌ అన్నారు.

ఇది జగన్ మార్క్ అరాచకం – హోం మంత్రి అనిత

ప్రకాశం జిల్లా పొదిలి పర్యటనలో జగన్ మార్క్ అరాచకం చూపించారని ఏపీ హోం మంత్రి అనిత(Minister Anitha) ఎద్దేవా చేసారు. పొదిలి లో మహిళలు మీద రాళ్ళు వేయించారు. పోలీసులు మీద రాళ్ళు విసిరించారు. గత నాలుగు రోజులు నుంచి రాష్ట్రంలో పరిస్థితి అందరికీ తెలుసు. కొమ్మినేని, కృష్ణంరాజు వాఖ్యలు తరవాత మహిళలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. శాంతి యుతంగా మహిళలు నిరసన చేస్తుంటే …వైసిపి గుండాలు దాడి చేశారు. పొదిలి లో జగన్ వెళ్ళిపోయిన తరవాత వైసిపి గుండాలు మహిళలు మీద చెప్పులు, రాళ్ళు వేసారు. ఒక వైపు సజ్జల రామకృష్ణ రెడ్డి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. గతంలో మా టిడిపి నేత పట్టాభి చిన్న మాట మాట్లాడితే మా టిడిపి కార్యాలయం పై దాడి చేశారు. ఇప్పటికైనా జగన్(YS Jagan) , భారతిలు అమరావతి మహిళలకు క్షమాపణ చెప్పాలి. సొంత చెల్లి తల్లి కోసం సోషల్ మీడియాలో తప్పుడు మాటలు వచ్చిన జగన్ స్పందించలేదని మంత్రి అనిత స్పష్టం చేసారు.

జగన్‌ ఉన్మాద మనస్తత్వానికి ఇది నిదర్శనం – దేవినేని ఉమ

పొదిలిలో మహిళలపై సైకోలతో దాడి చేయించడం దుర్మార్గమని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. పొదిలిలో రాళ్లదాడి… జగన్‌ ఉన్మాద మనస్తత్వానికి నిదర్శనమని విమర్శించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలపై రాళ్ల దాడి చేశారని మండిపడ్డారు. పోలీసుల తలలు పగలగొట్టిన వైకాపా సైకో మూకలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

మహిళలపై జగన్ కక్ష సాధింపు – మాజీ మంత్రి పీతల సుజాత

మహిళలపై ఎందుకీ విద్వేషం, ద్వేషం, అరాచకాలు జగన్ రెడ్డి అని మాజీ మంత్రి పీతల సుజాత ప్రశ్నించారు. మహిళలను కించపరిచే మాటలు మాట్లాడితే సొంత పార్టీ వాడైనా వదిలి పెట్టకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి మహిళలను సంకర జాతి అన్న సజ్జలది అసలు మానవ జాతే కాదన్నారు. మహిళలు ఓట్లు వేయలేదనే కక్షతో జగన్ రెడ్డి వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. సాక్షిని అడ్డంపెట్టుకొని మహిళా లోకాన్నే అవమానపరుస్తున్నారని ఫైర్ అయ్యారు. ‘మొన్నేమో మహిళలను వేశ్యలు అన్నారు.. నిన్న సంకర జాతి అన్నారు… నేడు పొదిలిలో బీర్ బాటిళ్ళతో దాడి చేశారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : CM Chandrababu Naidu: తల్లికి వందనం అమలుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

Leave A Reply

Your Email Id will not be published!