Minister Nara Lokesh: అన్ని సమస్యలకు పరిష్కారం చూపేది విద్య మాత్రమే – మంత్రి నారా లోకేశ్‌

అన్ని సమస్యలకు పరిష్కారం చూపేది విద్య మాత్రమే - మంత్రి నారా లోకేశ్‌

Nara Lokesh : విద్య ద్వారానే సమాజంలో అన్ని సమస్యలకూ పరిష్కారం లభిస్తుందని ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. మచిలీపట్నంలో పర్యటనలో భాగంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ తో కలిసి కృష్ణా వర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్ధులకు డిగ్రీ పట్టాలను అందజేసారు. స్నాతకోత్సవంలో భాగంగా మంత్రి లోకేశ్ (Nara Lokesh) ప్రసంగిస్తూ… నైతిక విలువతో జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని, ఉన్నత లక్ష్యంతో దేశ సమగ్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.

‘‘మచిలీపట్నం.. వాణిజ్యం, కళలు, విద్యారంగంలో గొప్పవాళ్లను అందించింది. డిగ్రీతో చదువు ఆపవద్దు. నేర్చుకోవడం జీవితాంతం కొనసాగించాలి. డిజిటల్‌ యుగంలో జ్ఞానానికి మించిన సంపద లేదు. కెరీర్‌లో ఎదిగే క్రమంలో ఎప్పుడూ విలువలు కోల్పోవద్దు. గెలుపు గమ్యస్థానం కాదు.. స్థిరమైన వృద్ధి, లక్ష్యంతో కూడిన పయనం. యవత అధ్యాపకులుగా, పరిశోధకులుగా, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి’’ అని లోకేశ్‌ చెప్పారు. ఈ స్నాతకోత్సవం కార్యక్రమానికి ఏపీ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ తదితరులు హాజరయ్యారు.

Nara Lokesh – ఏపీ పీజీసెట్‌ ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో పోస్ట్‌ గ్యాడ్యుయేట్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌-2025 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను మంత్రి నారా లోకేశ్‌ ‘ఎక్స్‌’ వేదికగా విడుదల చేశారు. ఏపీపీజీసెట్‌లో 88.60శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు వెల్లడించారు. జూన్‌ 9 నుంచి 12 వరకు జరిగిన ఈ పరీక్షల్లో 25,688 మంది రిజిస్టర్‌ చేసుకోగా… 19,488 మంది క్వాలిఫై అయినట్లు పేర్కొన్నారు. మరోవైపు, ఈ ఫలితాలకు సంబంధించిన వివరాలను తిరుపతిలో సెట్‌ ఛైర్మన్‌ ఆచార్య అప్పారావు, కన్వీనర్‌ ఆచార్య పీసీ వెంకటేశ్వర్లు వెల్లడించారు.

Also Read : CM Chandrababu : ప్రజాస్వామ్యంలో నియంతలకు చోటులేదు – సీఎం చంద్రబాబు

Leave A Reply

Your Email Id will not be published!