Minister Nara Lokesh: దేశంలో ఐదవ ఎకనామిక్ క్యాపిటల్‌ గా విశాఖ – మంత్రి నారా లోకేష్

దేశంలో ఐదవ ఎకనామిక్ క్యాపిటల్‌ గా విశాఖ - మంత్రి నారా లోకేష్

Nara Lokesh : దేశంలోనే ఐదవ ఎకనామిక్ క్యాపిటల్‌ గా విశాఖ(Visakhapatnam)ను మార్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. విశాఖను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి… హైదరాబాద్ కంటే గొప్పగా తీర్చిదిద్దుతామన్నారు. విశాఖ జిల్లా పర్యటనలో భాగంగా ఆర్కే బీచ్‌ వద్ద వరుణ్ గ్రూప్ నిర్మిస్తోన్న వరుణ్ బే సౌండ్స్ హోటల్‌ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నారా లోకేష్(Nara Lokesh) తల్లి భువనేశ్వరి, వరుణ్ గ్రూప్ సీఈఓ ప్రభు కిషోర్, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు, రాష్ట్ర మంత్రులు అనిత, నాదెండ్ల మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

Minister Nara Lokesh Comment

ఈ సందర్భంగా మంత్రి లోకేష్(Nara Lokesh) మాట్లాడుతూ… వరుణ్ బే సాండ్స్ హోటల్ విశాఖకు ఐకానిక్ గా మారనుందన్నారు. వరుణ్ గ్రూప్ నిర్మాణం చేపడుతున్న వరుణ్ బే సాండ్స్ హోటల్ కేవలం ఆంధ్రప్రదేశ్‌కే కాదు… భారతదేశంలోనే ఒక ఐకానిక్ ప్లేస్‌గా మిగులుతుందన్నారు. విశాఖ పరిశ్రమలు, ఐటీ హబ్‌గా మార్చుతున్నామన్నారు. గడిచిన 10 నెలల్లో విశాఖకు చాలా ప్రాజెక్టులు తీసుకువచ్చామని.. రానున్న 5 సంవత్సరాల్లో విశాఖలో 5 లక్షల ఐటీ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. విశాఖను ఆంధప్రదేశ్ ఐకానిక్ క్యాపిటల్‌గా మార్చుతామని చెప్పారు. ఎన్నికల ఫలితాల్లో తనకు రాష్ట్రంలో అత్యధిక మెజార్టీల స్థానాల్లో మూడవ స్థానం వచ్చినందుకు కొంచెం బాధనిపించిందని.. కానీ మొదటి రెండు అత్యధిక మెజారిటీ స్థానాలు విశాఖకు వచ్చాయన్నారు. దీన్ని బట్టి విశాఖ ప్రజలు తమపై ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్నారని అర్థమైందన్నారు. విశాఖ అభివృద్ధి చేసి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు.

చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ వైపు పరుగులు పెడుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామికంగా, పర్యాటకంగా, ఐటీ పరంగా అభివృద్ధి చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. గడిచిన ఐదేళ్లలో ప్రజలు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు తీవ్రమైన ఇబ్బందులకు గురయ్యారన్నారు. చంద్రబాబును విశాఖపట్నం ఎయిర్‌పోర్టులోకి నగరంలోకి రాకుండా అడ్డగించారన్నారు. విజయనగరం తీర్థాలు గుడికి వెళుతుంటే బుల్డేజర్లు, జేసీబీలు పెట్టి రాకుండా చేయాలని చేశారని మండిపడ్డారు. లులు గ్రూప్ కూడా త్వరలో విశాఖకు వస్తుందన్నారు.

గడిచిన 10 నెలల్లోనే విశాఖకు టీసీఎస్, మెటల్ ప్లాంట్, హైడ్రోజన్ ప్లాంట్ వంటి సమస్యను తీసుకువచ్చి ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యంగా తీసుకున్నామని చెప్పారు. మన ముఖ్యమంత్రి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు.. స్పీడ్ అఫ్ డూయింగ్ బిజినెస్ చేయమంటున్నారు’ అని అన్నారు. ఉత్తరాంధ్రలోనే ట్రిలియన్ డాలర్ ఎకానమీని తీసుకొస్తామని గర్వంగా చెప్తున్నామని తెలిపారు.

అమరావతి భవనాలు మూడేళ్లలో నిర్మాణం చేస్తామని… ఇప్పుడు వరుణ్ గ్రూప్ నిర్మాణం చేపడుతున్న హోటల్ రెండేళ్లలోనే పూర్తి చేస్తారని నమ్మకం ఉందన్నారు. 2027 మార్చి 31 లోపు వరుణ్ గ్రూప్ చేపడుతున్న వరుణ్ బే సాండ్స్ హోటల్‌ను పూర్తి చేయాలన్నారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు సంవత్సరంలోపు ప్రారంభం చేస్తామన్నారు. విజయవాడ ఎయిర్‌పోర్టు కన్నా ముందే… భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభిస్తామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.

Also Read : CM Chandrababu Naidu: కుప్పం గంగమ్మ ఆలయ పాలకమండలి కమిటీ నియామకం పూర్తి

Leave A Reply

Your Email Id will not be published!