Minister Nimmala Ramanaidu: బుడమేరు సీసీ వాల్ పనుల జాప్యంపై మంత్రి నిమ్మల ఆగ్రహం
బుడమేరు సీసీ వాల్ పనుల జాప్యంపై మంత్రి నిమ్మల ఆగ్రహం
Nimmala Ramanaidu : గతేడాది వరదల్లో బుడమేరుకు గండ్లు పడిన ప్రాంతాల్లో జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. అక్కడ చేపట్టిన సీసీ వాల్ నిర్మాణ పనుల్ని అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. అత్యవసరంగా పూడ్చిన 3 గండ్లను కలుపుతూ రూ.23 కోట్ల వ్యయంతో సీసీ వాల్ నిర్మాణం చేపట్టినట్టు మంత్రి వివరించారు. వర్షాకాలం మొదలయ్యేలోగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కొన్ని చోట్ల పనులు ఆలస్యం కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టు ఏజెన్సీకి నోటీసులు జారీ చేయాలని అధికారులకు సూచించారు. పనులు వేగవంతం చేసేలా యంత్రాలు, మ్యాన్పవర్ పెంచుకుని రోజుకు 3 షిఫ్ట్ల్లో పనిచేయాలని ఆదేశించారు.
Minister Nimmala Ramanaidu Slams
గతేడాది కురిసిన భారీ వర్షాలకు బుడమేరుకు గండి పడటంతో విజయవాడను వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. కట్టుబట్టలతో లక్షలాది మంది ప్రజలు పునరావాస కేంద్రాల్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ వరదలను తలచుకుంటేనే ఇప్పటికీ సింగ్ నగర్, పరిసర ప్రాంతాల వాసులు వణికిపోతారు. జీవితంలో మళ్లీ అలాంటి వరదలు రాకూడదని, అలాంటి ఉపద్రవాలను తట్టుకోలేమని చెప్తారు.
Also Read : Education Department: ఐదుగురు ఎవల్యూవేటర్లను సస్పెండ్ చేస్తూ విద్యాశాఖ సంచలన నిర్ణయం