Minister Rajnath Singh: అంతర్జాతీయ టెర్రరిజానికి తండ్రి పాకిస్థాన్ – మంత్రి రాజ్నాథ్ సింగ్
అంతర్జాతీయ టెర్రరిజానికి తండ్రి పాకిస్థాన్ - మంత్రి రాజ్నాథ్ సింగ్
Rajnath Singh : స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ప్రజాస్వామ్యానికి తల్లిగా భారత్ గుర్తింపు తెచ్చుకుందని… కాని పాకిస్థాన్ మాత్రం అంతర్జాతీయ ఉగ్రవాదానికి తండ్రిగా మారిందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. కాబట్టి పాకిస్థాన్ కు విదేశీ నిధులు ఆపేయాలని అంతర్జాతీయ సంస్థలకు విజ్ఞప్తి చేశారు. పాకిస్థాన్కు నిధులు ఇస్తే ఉగ్రవాదానికి నిధులిచ్చినట్టేనని అన్నారు. డెహ్రాడూన్లో జరిగిన నేషనల్ సెక్యూరిటీ డైలాగ్ లో రాజ్నాథ్ ఉత్తేజభరితమైన ప్రసంగం చేశారు.
Minister Rajnath Singh Comments
ఈ సందర్భంగా మంత్రి రాజ్నాథ్ సింగ్(Rajnath Singh) మాట్లాడుతూ… భారతదేశ చరిత్రలో ఉగ్రవాదంపై జరిపిన అతిపెద్ద దాడి ఆపరేషన్ సిందూర్ అని అన్నారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా జరిపిన ఆపరేషన్ సిందూర్ భారతదేశ భద్రతా వ్యూహాన్ని బలంగా చాటిచెప్పిందని తెలిపారు. భారతదేశ రక్షణ, భద్రతా వ్యవస్థకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం గత 11 ఏళ్లుగా విస్తృతమైన సంస్కరణలు చేపట్టిందని ప్రశంసించారు. రక్షణ ఉత్పత్తులు, ఎగుమతులు లక్ష్యంగా మరింత పటిష్ట, స్వయంసమృద్ధ భారత్కు కృషి జరుగుతోందని, ఇదే సమయంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దృఢ వైఖరి తీసుకున్నామని అన్నారు.
కేంద్రం 370వ అధికరణను రద్దు చేసిన తర్వాత జమ్మూకశ్మీర్లో శాంతి పవనాలు వీస్తూ, ప్రగతిపథంలోకి దూసుకువెళ్తున్నామని అన్నారు. దీనిని పాకిస్థాన్ ఉగ్రవాద కార్యకలాపాల ద్వారా పట్టాలు తప్పించే ప్రయత్నాలు చేస్తోందని దుయ్యపట్టారు. పాకిస్థాన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా కశ్మీర్ ప్రగతిని ఎవ్వరూ అడ్డుకోలేరన్నారు. స్వదేశీ రక్షణ ఉత్పత్తులను పెంచేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వివిరిస్తూ, 2013-2014లో రూ.2.53 లక్షల కోట్లు ఉన్న రక్షణ బడ్జెట్ను 2024-2025లో 6.22 లక్షల కోట్లకు పెంచామని చెప్పారు. రక్షణ ఉత్పత్తులు రూ.1.30 లక్షల కోట్ల నుంచి రూ.686 కోట్లకు పెరిగాయని చెప్పారు. 2025 ఆర్థిక సంవత్సరంలో ఈ ఉత్పత్తుల లక్ష్యం రూ.1.75 లక్షలుగా, ఎగుమతులు రూ.30,000 కోట్లుగా ఉందని చెప్పారు.
Also Read : Minister Nara Lokesh: అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై మంత్రి లోకేష్ సమీక్షా సమావేశం