Minister Ram Mohan Naidu : తెలుగు రాష్ట్రాల్లో కొత్త ఏయిర్పోర్టులపై కీలక అంశాలు

రామ్మోహన్ నాయుడు ఆదివారం నాడు విజయనగరంలో పర్యటించారు...

Minister Ram Mohan : ఆంధ్రప్రదేశ్‌లోని ఓర్వకల్లు, దగదర్తి, నాగార్జునసాగర్, కుప్పంలో ఎయిర్‌పోర్టులను త్వరలో నిర్మిస్తామని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. వీటితో పాటు తెలంగాణలో కూడా కొత్త ఎయిర్ పోర్టులను నిర్మిస్తామని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా చాలా ఎయిర్ పోర్టులను త్వరలో పూర్తి చేయనున్నామని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.

Minister Ram Mohan Naidu Comment..

రామ్మోహన్ నాయుడు ఆదివారం నాడు విజయనగరంలో పర్యటించారు. పలు అభివృద్ధి పనుల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ… ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చే శక్తి భోగాపురం ఎయిర్ పోర్ట్‌కి ఉందని తెలిపారు. 2026 జూన్ నెలలోపు ఎయిర్ పోర్ట్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నామని అన్నారు. ప్రాజెక్ట్ పనులు వేగంగా సాగుతున్నాయని చెప్పారు. ప్రతినెల ఎయిర్ పోర్ట్ పనులను పరిశీలించి వేగవంతం చేస్తామని అన్నారు. ఇప్పటి వరకు 36.6 శాతం పనులు పూర్తి అయ్యాయని స్పష్టం చేశారు. అనుకున్న సమయానికి ముందే పనులు పూర్తి చేస్తామని అన్నారు. ఉదాన్ స్కీమ్ వల్ల భారతదేశ విమానయాన శాఖ ప్రపంచంలోనే ఉన్నతంగా తయారైందని మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.

Also Read : Sheikh Hasina : అమెరికాపై మాజీ బాంగ్లాదేశ్ ప్రధాని సంచలన ఆరోపణలు

Leave A Reply

Your Email Id will not be published!