Minister Seethakka: గవర్నర్‌ తో మంత్రి సీతక్క భేటీ ! కీలక బిల్లులు ఆమోదించాలని విజ్ఞప్తి !

గవర్నర్‌ తో మంత్రి సీతక్క భేటీ ! కీలక బిల్లులు ఆమోదించాలని విజ్ఞప్తి !

Minister Seethakka: తెలంగాణ గవర్నర్‌ జిష్ణు దేవ్‌ వర్మతో తెలంగాణ మంత్రి సీతక్క రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఇరువురు చర్చించారు. గవర్నర్‌ తో భేటీ అనంతరం మంత్రి సీతక్క(Minister Seethakka) మీడియాతో మాట్లాడారు.

Minister Seethakka Meet..

‘‘2022లో ములుగును మున్సిపాలిటీగా గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బిల్లుకు ఆమోదం తెలిపి గవర్నర్‌ కు పంపింది. రెండు సంవ‌త్స‌రాలుగా పెండింగ్‌ లోనే ములుగు మున్సిపాలిటి అంశం ఉంది. ములుగు మున్సిపాలిటీ బిల్లుతో పాటు మరో ఐదు బిల్లుకు ఆమోదం తెలుపాలని ఈ సందర్భంగా గవర్నర్‌కు విజ్ఞప్తి చేశాం. అదిలాబాద్ అంశాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళి విషయాన్ని తెలియజేసాం.

అదిలాబాద్, నాగర్ కర్నూల్ చెంచు ప్రాంతాల్లో పర్యటించాలని గవర్నర్‌ను కొరాం. గవర్నర్‌ ములుగులో ఓ గ్రామాన్ని దత్తత తీసుకునే ఆలోచనలో ఉన్నారు. దత్తత గ్రామాల లిస్ట్ గవర్నర్‌కు పంపాం, అదిలాబాద్ జిల్లా పర్యటనకు గవర్నర్ సానుకూలంగా స్పందించారు. ములుగు మున్సిపాలిటీ బిల్లు ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద ఉందని తెలిసింది. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాము’’ అని సీతక్క పేర్కొన్నారు.

Also Read : Arvind Kejriwal: నేను అవినీతిపరుడిని అంటే ప్రత్యర్థులు కూడా నమ్మరు – ఆప్ అధినేత కేజ్రీవాల్‌

Leave A Reply

Your Email Id will not be published!