Mithali Raj Mentor : గుజరాత్ జెయింట్స్ మెంటర్ గా మిథాలీ
విమెన్స్ జట్టుకు సలహాదారుగా ఒప్పందం
Mithali Raj Mentor : హైదరాబాద్ స్టార్ క్రికెటర్ గా పేరొందిన మిథాలీ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె వరల్డ్ క్లాస్ క్రికెట్ నుంచి ఇటీవలే తప్పుకున్నారు. తాజాగా విమెన్స్ గుజరాత్ జెయింట్స్ జట్టుకు మార్గదర్శకురాలి (మెంటార్ ) గా , సలహాదారురాలిగా చేరింది. ఈ మేరకు గుజరాత్ జెయింట్స్ మేనేజ్ మెంట్ తో ఒప్పందం చేసుకుంది.
ఈ విషయాన్ని గుజరాత్ విమెన్స్ టీం యాజమాన్యం వెల్లడించింది. ఇదిలా ఉండగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు చొరవ కారణంగా మహిళల క్రికెట్ ను నిలకడగా ఎదిగేందుకు దోహద పడుతుందని పేర్కొన్నారు మిథాలీ రాజ్(Mithali Raj Mentor). యువ ఆటగాళ్లు క్రికెట్ ను ప్రొఫెషనల్ గా తీసుకునేలా ప్రోత్సహిస్తుందని స్పష్టం చేశారు.
మాజీ భారత జట్టు కెప్టెన్ మహిళల క్రికెట్ ను ప్రోత్సహిస్తుంది. మెంటార్ గా గుజరాత్ లో అట్టడుగు స్థాయిలో క్రీడను అభివృద్ది చేయడంలో సహాయ పడుతుందని గుజరాత్ జెయింట్స్ ప్రకటించింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ సీజన్ మహిళల క్రికెట్ కు ఒక అద్భుతమైన అవకాశం.
అదానీ గ్రూప్ ప్రమేయం కూడా క్రీడకు భారీ ప్రోత్సాహాన్ని ఇస్తుందని పేర్కొన్నారు మిథాలీ రాజ్. మహిళల క్రికెట్ క్రమంగా పెరుగతోంది. ఈ రకమైన ప్రేరణ నిస్సందేహంగా యువతులను వృత్తి పరంగా క్రికెట్ ను చేపట్టేలా ప్రోత్సహిస్తుందని స్పష్టం చేశారు మాజీ కెప్టెన్(Mithali Raj Mentor).
ఇదిలా ఉండగా అదానీ స్పోర్ట్స్ లైన్ రూ. 1289 కోట్లు వెచ్చించింది. ఇటీవల నిర్వహించిన వేలం పాటలో గుజరాత్ జెయింట్స్ జట్టు బిడ్ లో భారీ ధరకు కొనుగోలు చేసింది. అదానీ ఎంటర్ ప్రైజెస్ డైరెక్టర్ ప్రణవ్ అదానీ మిథాలీ రాజ్ ను రోల్ మోడల్ అని పిలిచారు.
Also Read : టీమిండియా కీవీస్ బిగ్ ఫైట్