MMTS Rape Attempt: పోలీసుల అదుపులో ఎంఎంటీఎస్‌ అత్యాచారయత్నం కేసు నిందితుడు

పోలీసుల అదుపులో ఎంఎంటీఎస్‌ అత్యాచారయత్నం కేసు నిందితుడు

MMTS Rape Attempt : సికింద్రాబాద్‌ నుంచి మేడ్చల్‌ కు ఎంఎంటీఎస్ రైలు(MMTC Train)లో వెళ్తుండగా యువతిపై జరిగిన అత్యాచారయత్నం ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనలో ఓ అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని మేడ్చల్‌ జిల్లా గౌడవల్లి గ్రామానికి చెందిన జంగం మహేశ్‌ గా గుర్తించారు. అతడి ఫొటోను బాధితురాలికి చూపించగా… అనుమానితుడిని ఆమె సరిగా గుర్తించలేకపోయినట్లు సమాచారం. ఏడాది క్రితమే మహేశ్‌మను భార్య వదిలివేసింది. తల్లిదండ్రులు కూడా చనిపోవడంతో ఒంటరిగా ఉంటున్నాడు. గంజాయికి బానిసైన అతడు పాత నేరస్థుడని పోలీసులు పేర్కొన్నారు.

MMTS Rape Attempt in Secendrabad

సికింద్రాబాద్‌ జీఆర్పీ పోలీసుల వివరాల ప్రకారం… అనంతపురం జిల్లాకు చెందిన యువతి (23) మేడ్చల్‌ లో ఓ ప్రైవేట్‌ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. తన సెల్‌ ఫోన్‌ రిపేర్‌ చేయించుకుని సికింద్రాబాద్‌ నుంచి ఎంఎంటీఎస్‌లో మేడ్చల్‌ కు బయలుదేరింది. అయితే మహిళల కోచ్‌ లో ఆమె యువతి ఒక్కతే ఉండగా నిందితుడు ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అతని నుంచి తప్పించుకునేందుకు బాధితురాలు రైలు నుంచి బయటకు దూకింది. కొంపల్లి సమీప ప్రాంతంలోని రైలు బ్రిడ్జి వద్ద కిందపడి గాయపడిన ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలిని రైల్వే ఎస్పీ చందనా దీప్తి పరామర్శించారు.

ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు… మొత్తం నాలుగు బృందాలుగా విడిపోయి పోలీసులు నిందితుడి కోసం గాలించారు. సికింద్రాబాద్‌తోపాటు అక్కడి నుంచి మేడ్చల్‌ వరకూ 28 కిలోమీటర్ల ప్రాంతంలోని రైల్వేస్టేషన్లలో అన్ని సీసీ కెమెరాలను పరిశీలించారు. అనంతరం అనుమానితుడి ఫోటోను బాధితురాలికి చూపించగా… ఆమె గుర్తుపట్టినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నిందితుడు మహేశ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

Also Read : MMTS Rape Attempt: పోలీసుల అదుపులో ఎంఎంటీఎస్‌ అత్యాచారయత్నం కేసు నిందితుడు

Leave A Reply

Your Email Id will not be published!