Mallikarjun Kharge : అబ‌ద్దాలు చెప్పడంలో మోదీ నెంబ‌ర్ వ‌న్

కాంగ్రెస్ పార్టీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే

Mallikarjun Kharge : ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీపై నిప్పులు చెరిగారు. ఈ దేశంలో అబ‌ద్దాల‌కు కేరాఫ్ పీఎం అంటూ ఎద్దేవా చేశారు. మోస పూరిత‌మైన హామీలు ఇవ్వ‌డం, మాయ మాట‌లు చెప్ప‌డం, ప్ర‌జ‌ల‌ను మ‌భ్య పెట్ట‌డంలో మోదీ ఆరి తేరారంటూ ఆరోపించారు ఖ‌ర్గే.

కులం, మతం, ప్రాంతం పేరుతో ఓట్ల‌ను కొల్లగొట్ట‌డంలో సిద్ద‌హ‌స్తులుగా మారారంటూ బీజేపీ నేత‌ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గుజ‌రాత్ రాష్ట్రంలో ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా సోమవారం న‌ర్మదా జిల్లా లోని దేడియాపాడ‌లో జ‌రిగిన ర్యాలీలో పాల్గొని ప్ర‌సంగించారు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే. 70 ఏళ్ల‌లో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో దేశ ప్ర‌జ‌లంద‌రికీ తెలుస‌న్నారు.

కానీ మీరు అధికారంలోకి వ‌చ్చాక ప్ర‌భుత్వ ఆస్తుల‌ను గంప గుత్త‌గా అమ్ముతున్న‌ది ఎవ‌రో కూడా జ‌నం గుర్తించార‌ని అన్నారు. దేశంలో వ్యాపారులు, కార్పొరేట్లు పాలిస్తున్నారంటూ ఆరోపించారు. వ్యాపార‌వేత్త‌ల‌కు మేలు చేకూర్చేలా ప్ర‌ధాన‌మంత్రి నిర్ణ‌యాలు తీసుకుంటున్నార‌ని మండిప‌డ్డారు. గ‌తంలో మోసం చేశారు ఇంకెంత కాలం ప్ర‌జ‌ల్ని మ‌భ్య పెడ‌తారంటూ మోదీని ప్ర‌శ్నించారు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే(Mallikarjun Kharge).

ప‌దే ప‌దే తాను పేద‌వాడిన‌ని చెబుతార‌ని కానీ ఆయ‌న అత్యంత ఖ‌రీదైన జీవితాన్ని అనుభ‌విస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. తాను అంట‌రానికులం నుంచి వ‌చ్చాన‌ని కానీ మీ పార్టీలో అలాంటి వారికి ఏనాడైనా అవ‌కాశాలు క‌ల్పించారా అంటూ నిల‌దీశారు. ఎవ‌రో ఒక‌రు లేదా ఇద్ద‌రు త‌ప్పితే అంతా ఉన్న‌త వ‌ర్గాల వారికే ప్ర‌యారిటీ క‌ల్పిస్తూ వ‌స్తున్నారంటూ మండిప‌డ్డారు ఖ‌ర్గే.

Also Read : ఆసామీల‌కు దోచి పెడుతున్న మోదీ – రాహుల్

Leave A Reply

Your Email Id will not be published!