PM Modi Dhillon : ఆర్ఎస్ఎస్బీ చీఫ్ ధిల్లాన్ తో మోదీ భేటి

పంజాబ్ లో ప్ర‌ముఖ ఆధ్యాత్మిక సంస్థ

PM Modi Dhillon : ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ పంజాబ్ లో ప్ర‌సిద్ది చెందిన రాధా సోమి స‌త్సంగ్ బియాస్ (ఆర్ఎస్ఎస్బీ) ని సంద‌ర్శించారు. ఈ సంద‌ర్బంగా శ‌నివారం ఆర్ఎస్ఎస్బీ చీఫ్ ధిల్లాన్ తో భేటీ(PM Modi Dhillon) అయ్యారు. అంత‌కు ముందు ప్ర‌ధాన మంత్రి హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నారు.

ఇదిలా ఉండ‌గా ఈ ఆధ్యాత్మిక సంస్థ పంజాబ్ లోని అమృత్ స‌ర్ న‌గ‌రానికి దాదాపు 45 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న బియాస్ ప‌ట్ట‌ణంలో కొలువై ఉంది. ఆర్ఎస్ఎస్బీ చీఫ్ బాబా గురీంద‌ర్ సింగ్ ధిల్లాన్ తో ప్ర‌ధాన మంత్రి భేటీ అయ్యారు. ఈ సంద‌ర్బంగా ప‌లు సామాజిక కార్య‌క్ర‌మాలు, అమ‌లు చేస్తున్న తీరు గురించి అడిగి తెలుసుకున్నారు.

అంత‌కు ముందు న‌రేంద్ర మోదీ స‌త్ సంగ్ ఆధ్యాత్మిక క్షేత్రాన్ని క‌లియ తిరిగారు. అన్నింటిని ప‌రిశీలించారు. అక్క‌డ డేరా క‌మ్యూనిటీ కిచెన్ వ‌ద్ద‌కు వెళ్లారు. ప‌ని చేస్తున్న మ‌హిళ‌ల‌తో ముచ్చ‌టించారు. యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు ప్ర‌ధాన‌మంత్రి. ఏకంగా న‌రేంద్ర మోదీ రాధా సోమి స‌త్సంగ్ బియాస్ లో ఏకంగా గంట‌కు పైగా గ‌డిపారు.

ఆర్ఎస్ఎస్బీని సంద‌ర్శించ‌డం త‌న‌కు గౌర‌వంగా ఉంద‌న్నారు ప్ర‌ధాన‌మంత్రి. ఈ మేర‌కు ట్విట్ట‌ర్ లో షేర్ చేశారు. ఇది ఒక అద్భుత‌మైన అనుభ‌వంగా త‌న‌కు మిగిలి పోతుంద‌ని పేర్కొన్నారు న‌రేంద్ర మోదీ. కాగా ఈ ఆధ్యాత్మిక సంస్థ‌కు పంజాబ్ , హ‌ర్యానా, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ల‌లో పెద్ద ఎత్తున భ‌క్తులు ఉన్నారు.

భారీ ఎత్తున ఓటు బ్యాంకు కూడా ఉంది. అయితే ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో ప్ర‌ధానమంత్రిని ఢిల్లీలో ధిల్లాన్ క‌లిశారు.

Also Read : బీజేపీకి ఓటు అభివృద్దికి మ‌లుపు – మోదీ

Leave A Reply

Your Email Id will not be published!