MP Purandeswari : మోదీ పాలనపై ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి ప్రశంసలు
దేశంలో అవినీతి రహిత పాలన ఉండాలని ప్రజలు భావించి బీజేపీని గెలిపిస్తున్నారని చెప్పుకొచ్చారు పురందేశ్వరి...
MP Purandeswari : ఎన్డీఏ కూటమికి ప్రజలు మంచి విజయాన్ని అందించారని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి(MP Purandeswari) వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశానికి సుపరిపాలన, ధృడమైన నాయకత్వంతో మంచి పాలన అందిస్తున్నారని ఉద్ఘాటించారు. వికసిత్ భారత్ కేవలం అభివృద్ధి చెందిన భారత దేశమే కాదు ప్రతి సామాజికవర్గం ఎదుగుదల సాధించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు పురందేశ్వరి.
MP Purandeswari Praises
ఇవాళ (మంగళవారం) విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో పురందేశ్వరి మీడియాతో మాట్లాడారు. మోదీ నాయకత్వంలో దేశాన్ని పాలించగల సత్తా ఉందని ప్రజలు భావించి బీజేపీకి భారీ విజయాన్ని అందించారని చెప్పారు. సబ్ కా వికాస్, సబ్ కా ప్రయాస్, సబ్ కా విశ్వాస్తో అన్ని లక్ష్యాలని ఛేదించాలనే ఉద్దేశంతో మోదీ పాలన కొనసాగిస్తున్నారని వివరించారు. దేశంలో అవినీతి రహిత పాలన ఉండాలని ప్రజలు భావించి బీజేపీని గెలిపిస్తున్నారని చెప్పుకొచ్చారు పురందేశ్వరి.
ఆంధ్రరాష్ట్రంలో గత జగన్ ప్రభుత్వం రాక్షస పాలనతో ప్రజలని ఇబ్బందులకి గురి చేశారని పురందేశ్వరి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చాక అభివృద్ధి దిశలో పాలన కొనసాగుతోందని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు అందించటం అలాగే రాజధాని నిర్మాణం కోసం నిధులు కేటాయించారని పురందేశ్వరి పేర్కొన్నారు.
Also Read : Mallikarjun Kharge : ప్రధాని మోదీకి ఆ అంశంపై ఖర్గే కీలక లేఖ