MP Sanjay Singh : కేంద్రం రాజ్యాంగ విరుద్దం – సంజయ్ సింగ్
ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్ ప్రవేశ పెట్టడంపై ఫైర్
MP Sanjay Singh : కేంద్రం అనుసరిస్తున్న తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్. సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఒక్క శాంతి భద్రతలు అంశం మినహా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏ ఒక్క దానితో లెఫ్టినెంట్ గవర్నర్ కు సంబంధం ఉండదని. అయినా కేంద్రం కావాలని ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు తీసుకు వచ్చే ప్రయత్నం చేయడం దారుణమన్నారు సంజయ్ సింగ్.
MP Sanjay Singh Comments
మంగళవారం ఎంపీ మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు నిర్ణయానికి పూర్తిగా వ్యతిరేకం. ఇది డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి విరుద్దమని మండిపడ్డారు. ఇది దేశ సమాఖ్య నిర్మాణానికి బద్ద వ్యతిరేకమని ఆవేదన వ్యక్తం చేశారు ఎంపీ సంజయ్ సింగ్(MP Sanjay Singh). లోక్ సభలో మోదీ బీజేపీ సంకీర్ణ సర్కార్ కు మెజారిటీ ఉందని , కానీ రాజ్యసభలో లేదన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు వీగి పోవడం ఖాయమన్నారు ఎంపీ.
కేవలం ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను చూసి కేంద్రం, మోదీ భయపడుతున్నారంటూ ఆరోపించారు. అందుకే పదే పదే తమ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కేంద్రం కుట్రలు పన్నుతోందంటూ ధ్వజమెత్తారు. కానీ ప్రజాస్వామ్యం బతికే ఉందని ఢిల్లీ వాసులు నిరూపించారని స్పష్టం చేశారు.
Also Read : Gujarat CM : పేరెంట్స్ పర్మిషన్ ఉంటేనే ప్రేమ పెళ్లిళ్లు