Nagababu Ys Jagan : ప‌వ‌న్ ను అడ్డుకునే శ‌క్తి ఎవ‌రికీ లేదు

కొణిదెల నాగ‌బాబు షాకింగ్ కామెంట్స్

Nagababu Ys Jagan : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో రాజ‌కీయాలు మ‌రింత వేడెక్కాయి. టీడీపీ, జ‌న‌సేన ఓ వైపు వైసీపీ మ‌రో వైపు మాట‌ల తూటాలు పేలుస్తున్నాయి. నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి చేరుకున్నాయి. ఈ త‌రుణంలో రాబోయే ఎన్నిక‌ల‌కు కొంత స‌మ‌యం ఉన్నా ఇప్ప‌టి నుంచే ఆయా పార్టీలు త‌మ వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నాయి.

పాద‌యాత్ర‌లు, బ‌స్సు యాత్ర‌ల‌కు శ్రీ‌కారం చుట్టాయి. టీడీపీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడు ఆధ్వ‌ర్యంలో ఇప్ప‌టికే ఇదేం ఖ‌ర్మ పేరుతో స్టార్ట్ చేశారు. ఇదే స‌మ‌యంలో జ‌న‌సేన చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ వారాహిని సిద్దం చేశారు. బ‌స్సు యాత్ర‌కు శ్రీ‌కారం చుట్టారు. అయితే ఈ యాత్ర‌కు ప‌ర్మిష‌న్ లేద‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది జ‌గ‌న్ స‌ర్కార్.

దీనిపై సీరియ‌స్ గా స్పందించారు ఆ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, ప్రముఖ న‌టుడు కొణిదెల నాగ‌బాబు(Nagababu). ఆయ‌న షాకింగ్ కామెంట్స్ చేశారు. వారాహి యాత్ర జ‌రిపి తీరుతామ‌ని ప్ర‌క‌టించారు. ఒక‌వేళ వారాహిని ఆపితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాద‌యాత్ర చేప‌డ‌తార‌ని స్ప‌ష్టం చేశారు. పాద‌యాత్ర‌ను, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ఆపే ద‌మ్ము జ‌గ‌న్ రెడ్డికి లేద‌ని అన్నారు నాగ‌బాబు.

రాష్ట్రంలో రోడ్ల ప‌రిస్థితి ఎలా ఉందో జ‌గ‌న్ రెడ్డి పాల‌న కూడా అలాగే ఉందంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్ర‌జాస్వామ్యం అన్న‌ది లేద‌ని రాచ‌రిక పాల‌న సాగుతోంద‌ని ఆరోపించారు కొణిదెల నాగ‌బాబు. కాగా ఇత‌ర పార్టీల‌తో పొత్తు పెట్టుకునే అంశంపై ఇంకా చ‌ర్చించ లేద‌ని పేర్కొన్నారు. ఎలాంటి బెదిరింపుల‌కు తాము భ‌య‌ప‌డే ప్ర‌సక్తి లేద‌న్నారు .

Also Read : క‌న్న‌డ నాట మంగ్లీ కారుపై దాడి

Leave A Reply

Your Email Id will not be published!