Nandamuri Balakrishna: హిందూపురంలో నామినేషన్‌ వేసిన నందమూరి బాలకృష్ణ !

హిందూపురంలో నామినేషన్‌ వేసిన నందమూరి బాలకృష్ణ !

Nandamuri Balakrishna: టీడీపీ అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ మూడోసారి నామినేషన్‌ వేశారు. తన సతీమణి వసుంధరతో కలిసి హిందూపురం ఆర్వో కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలు అందజేశారు. హిందూపురంలో ఇప్పటికే వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలయ్య… ఈ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్‌ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. బాలకృష్ణ నామినేషన్‌ కు టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

Nandamuri Balakrishna Nomination..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… హిందూపురం నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశామని అన్నారు. ఎన్టీఆర్‌ను ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్తున్నామని చెప్పారు. హిందూపురం ప్రజలు తనను రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారన్నారు. తమ కుటుంబమంటే ఇక్కడి వారికి ఎంతో అభిమానమని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ పట్టణంలో తాగునీటి సమస్యను పరిష్కరించామన్నారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, కల్వర్టుల నిర్మాణానికి ప్రాధాన్యమిచ్చామని తెలిపారు. అన్న క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం తొలగించినా హిందూపురంలో రోజుకి 400 మందికి భోజనాలు ఏర్పాటు చేశామన్నారు.

Also Read:Venkatarami Reddy: సచివాలయం ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు !

Leave A Reply

Your Email Id will not be published!