Nandhamuri balakrishna: వైసీపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసింది

వైసీపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసింది: నందమూరి బాలకృష్ణ

Nandhamuri balakrishna: గడిచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఇసుక, మద్యం అమ్మకాల్లో భారీ స్కామ్ జరిగిందని ఆరోపించారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం భ్రష్టు పట్టించరు అని మండిపడ్డారు.

Nandhamuri balakrishna Comment

శ్రీసత్యసాయి జిల్లాలోని హిందూపురం రూరల్ పరిధిలోని కొటిపిలో అర్ధాంతరంగా నిలిచిపోయిన టిడ్కో ఇళ్లను ఆదివారం నాడు బాలకృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరు నెలల్లోనే టిడ్కో ఇళ్లు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కొత్త టెక్నాలజీతో బ్రిక్లెస్ ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఒక్కొక్క శాఖలో జరిగిన అవినీతి వెలికి తీసి బయటపడుతోందని తెలిపారు. త్వరలో మరిన్ని శాఖల్లో జరిగిన అక్రమాలు బయటకు వస్తాయని అన్నారు.

వైసీపీ నాయకులు వ్యవస్థలు అన్నింటినీ నాశనం చేశారని మండిపడ్డారు. ఇసుక, మద్యం, మైనింగ్లో అయితే కమీషన్ల కోసం అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. రిపాలన చేయడం చేతగాక మూడు రాజధానులు, నవరత్నాల పేరుతో మోసం చేశారని గత ప్రభుత్వాన్ని బాలకృష్ణ విమర్శించారు. గతంలో హిందూపురం ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది ఎన్టీఆర్ అని.. ఆయన ఆశయాలను కొనసాగిస్తానని బాలకృష్ణ తెలిపారు. హిందూపురం నియోజకవర్గ అభివృద్ధిపై సీఎం చంద్రబాబుతో చర్చిస్తానని చెప్పారు.

Also Read : KTR: నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే ఆ ఇద్దరు మోసగాళ్లు ఎవరు

Leave A Reply

Your Email Id will not be published!