Nara Chandrababu Naidu: రామోజీరావు పాడె మోసిన టీడీపీ అధినేత చంద్రబాబు !

రామోజీరావు పాడె మోసిన టీడీపీ అధినేత చంద్రబాబు !

Nara Chandrababu Naidu: రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు అంతిమయాత్ర ముగిసింది. రామోజీ ఫిల్మ్‌సిటీలోని రామోజీరావు నివాసం నుంచి ప్రారంభమైన ఈ యాత్ర… ఆయన ముందే సిద్ధం చేసుకున్న స్మారక కట్టడం వరకు కొనసాగింది. అక్షర యోధుడికి కడసారి వీడ్కోలు పలికేందుకు వివిధ పార్టీలకు చెందిన నేతలు, రామోజీ గ్రూపు సంస్థల ఉద్యోగులు, ప్రజలు తరలివచ్చారు. రామోజీరావు పార్థివదేహం వద్ద కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఫిల్మ్‌సిటీలోని రామోజీ గ్రూపు కార్యాలయాల మీదుగా స్మారక కట్టడం వరకు అంతిమయాత్ర సాగింది.

Nara Chandrababu Naidu…

తెలంగాణా ప్రభుత్వ లాంఛనాలతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున కూడా అధికారులు ఈ అంత్యక్రియలకు హాజరయ్యారు. ఈ అంత్యక్రియలకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. స్మృతి వనం వద్ద నివాళులర్పించిన అనంతరం రామోజీరావు పాడె మోశారు. రామోజీరావుతో చంద్రబాబు(Nara Chandrababu Naidu)కు ఉన్న అనుబంధం దృష్ట్యా ఆయన పాడె మోసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, సినీ ప్రముఖులు, రామోజీ గ్రూపు సంస్థల సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

రామోజీరావు అంతిమయాత్ర వాహనంపై కుమారుడు, ఈనాడు ఎండీ సీహెచ్‌ కిరణ్‌, కోడళ్లు శైలజా కిరణ్‌, విజయేశ్వరి, మనవరాళ్లు సహరి, బృహతి, దివిజ, కీర్తి సోహన, మనవడు సుజయ్‌, కుటుంబసభ్యులు ఉన్నారు. వీరితో పాటు సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కేంద్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే సుజనా చౌదరి తదితరులు వాహనంపై ఉన్నారు.

Also Read : Fish Medicine Distribution: ముగిసిన చేప ప్రసాదం పంపిణీ !

Leave A Reply

Your Email Id will not be published!