Nara Lokesh: లక్షల మంది జలసమాధి అయ్యేలా జగన్‌ కుట్ర – మంత్రి నారా లోకేశ్‌ ఆరోపణ

లక్షల మంది జలసమాధి అయ్యేలా జగన్‌ కుట్ర - మంత్రి నారా లోకేశ్‌ ఆరోపణ

Nara Lokesh: వరద ముంపునకు ప్రభుత్వమే కారణమంటూ వైసీపీ విష ప్రచారం చేస్తోందని మంత్రి నారా లోకేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కుట్రలు బయటపడకుండా ఆ పార్టీ నేతలు… ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. లక్షలాది మంది జలసమాధి అయ్యేలా సైకో జగన్‌ పన్నిన కుట్ర బట్టబయలైందన్నారు. ఈ మేరకు ప్రకాశం బ్యారేజీ కు బోట్లు కొట్టుకువచ్చి బ్యారేజీ దెబ్బతిన్న ఘటనపై ఆయన ఎక్స్‌ లో స్పందించారు.

Nara Lokesh Slams..

‘‘అధికారం అండతో సైకో జగన్‌ తన ఇసుక మాఫియా కోసం అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయేలా చేసి 50 మందిని చంపారు. 5 ఊళ్లను నామరూపాలు లేకుండా చేశారు. ఇదే ప్లాన్‌ ప్రకారం ఇనుప పడవలతో ప్రకాశం బ్యారేజీని ఢీకొని కూల్చేయాలని కుట్ర చేశారు. విజయవాడతో పాటు పదుల సంఖ్యలో లంక గ్రామాల నామరూపాలు లేకుండా చేసి లక్షల మంది జలసమాధి అయ్యేలా జగన్‌ పన్నిన కుట్ర బట్టబయలైంది. దీన్ని ప్లాన్‌ చేసింది సైకో జగన్‌ అయితే… అమలు చేసింది వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మాజీ ఎంపీ నందిగం సురేశ్‌’’ అని లోకేశ్‌ తన ఎక్స్ లో పేర్కొన్నారు.

Also Read : Minister Vangalapudi Anitha: విధ్వంసం సృష్టించడానికి బోట్లతో వైసీపీ కుట్ర – హోం మంత్రి అనిత

Leave A Reply

Your Email Id will not be published!