Nara Lokesh: జాతీయ మహిళా కమిషన్ పై నారా లోకేష్ ప్రశంసల వర్షం
జాతీయ మహిళా కమిషన్ పై నారా లోకేష్ ప్రశంసల వర్షం
Nara Lokesh : సాక్షి ఛానల్ డిబేట్ లో అమరావతి మహిళలను ఉద్దేశించి సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు, జర్నలిస్ట్ కృష్ణం రాజు చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ డిమేట్ లో అమరావతిని వేశ్యల నగరంగా కృష్ణంరాజు అభివర్ణించారు. దీనితో ఆంధ్రప్రదేశ్లో ఆగ్రహ జ్వాలలు రేకెత్తాయి. సాక్షి ఛానెల్, జర్నలిస్ట్ కృష్ణంరాజుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, కృష్ణంరాజు చేసిన అసభ్యకర వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. దీనితో జాతీయ మహిళా కమిషన్ చొరవను ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) అభినందించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
Minister Nara Lokesh Appreciates
‘అమరావతి(Amaravati) మహిళలను ఉద్దేశిస్తూ కృష్ణంరాజు చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై తక్షణమే స్పందించి చర్యలకు ఆదేశించిన జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ విజయ రహత్కర్ కు అభినందనలు. అమరావతి మహిళా రైతులను వేశ్యలుగా అభివర్ణించడం సిగ్గుచేటు మాత్రమే కాదు.. నేరం కూడా. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సత్వరమే స్పందించి వేగంగా చర్య తీసుకోవడం ద్వారా అలాంటి వ్యాఖ్యలను ఉపేక్షించేది లేదనే బలమైన సందేశం ఇచ్చింది. మేమంతా అమరావతి మహిళా రైతుల వెనుక ఉన్నాం. వారికి సత్వరమే న్యాయం జరగాలని’ నారా లోకేష్(Nara Lokesh) ట్వీట్ చేశారు.
జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను మహిళా కమిషన్ ఖండించింది. ఈ వ్యవహారంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేస్తూ మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ విజయ రహత్కర్ రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు. అమరావతి ఉద్యమంలో మహిళా రైతులు కీలకపాత్ర పోషించారని, కృష్ణంరాజు వ్యాఖ్యలపై మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా సుమోటోగా తీసుకుని విచారణకు మహిళా కమిషన్ ఆదేశించింది.
సజ్జలకు సమన్లు పంపించి వివరణ కోరతాం – రాయపాటి శైలజ
రాజధాని మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి సమన్లు పంపిస్తామని ఏపీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రాయపాటి శైలజ చెప్పారు. వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని కమిషన్ స్పష్టం చేసింది. సజ్జల వ్యాఖ్యలను నిరసిస్తూ రాజధాని మహిళలు మంగళగిరిలోని మహిళా కమిషన్ ఛైర్పర్సన్ను కలిసి ఫిర్యాదు చేశారు. వైసీపీ నేతలకు అమరావతి ప్రాంత మహిళలంటే చులకనైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఐదేళ్లు కేసులతో వేధించిన వైసీపీ ప్రభుత్వం… ఇప్పుడు ఆ పార్టీ నాయకులు మానసిక క్షోభకు గురి చేస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. 11 సీట్లకే పరిమితం కావడానికి రాజధాని మహిళలే కారణమని ఈ విధంగా తమను కించపరిచేలా వ్యాఖ్యానిచడం తగదని హితవు పలికారు. రాజధాని మహిళల ఫిర్యాదును జాతీయ మహిళా కమిషన్ కు పంపిస్తామని శైలజ చెప్పారు. ఫిర్యాదు అందక ముందే కమిషన్ సుమోటోగా తీసుకుని జాతీయ మహిళా కమిషన్కు లేఖ రాసిందని పేర్కొన్నారు.
Also Read : Sakshi Office: ఏలూరు సాక్షి కార్యాలయంపై దాడి ! ఫర్నీచర్ ధ్వంసం !