Nara Lokesh : జ‌గ‌న్ పాల‌న జ‌నం ఆవేద‌న

నారా లోకేష్ షాకింగ్ కామెంట్స్

Nara Lokesh : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ జ‌గ‌న్ పాల‌న‌ను టార్గెట్ చేశారు. ఆయ‌న చేప‌ట్టిన యువ గ‌ళం పాద‌యాత్ర కొన‌సాగుతోంది. ప‌ల్నాడు జిల్లా వినుకొండ‌లో భారీ ఎత్తున లోకేష్ కు సాద‌ర స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు నారా లోకేష్(Nara Lokesh). ఎంత కాలం ఇలా సంక్షేమ ప‌థ‌కాల పేరుతో మోసం చేస్తారంటూ ప్ర‌శ్నించారు.

Nara Lokesh Comments

రాష్ట్రాన్ని అప్పుల కుప్ప‌గా మార్చేశారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు . అంతే కాదు విశాఖ‌లో రెండున్న‌ర ల‌క్ష‌ల ఎక‌రాల విస్తీర్ణం ఎక్క‌డుంద‌ని ప్ర‌శ్నించారు. అస‌లు జ‌గ‌న్ కు సోయి ఉండే మాట్లాడుతున్నారా అంటూ నిల‌దీశారు. 1,58, 000 ఎక‌రాల విస్తీర్ణం మాత్ర‌మే ఉంద‌ని ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా సీఎం ఎలా మాట్లాడుతారంటూ ఎద్దేవా చేశారు నారా లోకేష్.

రాష్ట్రంలో రాచ‌రిక పాల‌న సాగుతోంద‌ని, జ‌నం తీవ్ర ఇబ్బందుల‌కు లోన‌వుతున్నార‌ని , మార్పు త‌థ్యమ‌ని ఇక తెలుగుదేశం పార్టీ ప‌వ‌ర్ లోకి రావ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి. త‌మ ఎజెండా ఒక్క‌టేన‌ని, అభివృద్దే త‌మ ల‌క్ష్య‌మ‌న్నారు. కుప్ప‌లు తెప్ప‌లుగా తీసుకు వ‌చ్చిన అప్పుల‌కు ఎవ‌రు జ‌వాబుదారీగా ఉంటారో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. మొత్తం భారం ప్ర‌జ‌ల‌పై ప‌డుతుంద‌ని హెచ్చ‌రించారు.

Also Read : MP Sanjay Singh : ఆర్డినెన్స్ బిల్లు వీగి పోవ‌డం ఖాయం

Leave A Reply

Your Email Id will not be published!