Suresh Khade : న‌రేంద్ర మోదీ భార‌తీయ ఆత్మ – ఖాడే

ఆయ‌న ఎన్న‌టికీ ఓడి పోర‌న్న మంత్రి

Suresh Khade : మ‌హారాష్ట్ర న్యాయ శాఖ మంత్రి సురేష్ ఖాడే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ అత్యంత శ‌క్తివంత‌మైన నాయ‌కుడ‌ని కొనియాడారు.

అంతే కాదు ఆయ‌న భార‌త దేశానికి ఆత్మ లాంటి వార‌న్నారు. సురేష్ ఖాడే(Suresh Khade) మీడియాతో మాట్లాడారు. మోదీకి గెల‌వ‌డం త‌ప్ప ఓడి పోవ‌డం అన్న‌ది లేద‌ని స్ప‌ష్టం చేశారు.

బీజేపీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడైన లాల్ కృష్ణ అద్వానీ సైతం ఓట‌మి పాల‌య్యారని, కానీ మోదీకి ఆ చ‌రిత్ర లేద‌న్నారు.

1977 నుంచి 2014 దాకా తాను పోటీ చేసిన ప్ర‌తి ఎన్నిక‌ల్లోనూ ఎక్క‌డా వెన‌క్కి తిరిగి చూసుకున్న దాఖ‌లాలు న‌రేంద్ర మోదీ(PM Modi) చ‌రిత్ర‌లో లేద‌న్నారు సురేష్ ఖాడే.

ఆనాటి ప్ర‌ధాన‌మంత్రిగా ప‌ని చేసిన అటల్ బిహారీ వాజ్ పేయి సైతం ఓట‌మి పాల‌య్యారని , కానీ మోదీ ఇప్ప‌టికీ విజేత‌గా నిలిచార‌న్నారు.

నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌యంత్ పాటిల్ , రాష్ట్రంలోని బారామ‌తి ప్రాంతానికి చెందిన శ‌ర‌ద్ ప‌వార్ ఆయ‌న బంధువును ఓడించడం అసాధ్య‌మ‌న్నారు.

ప‌శ్చిమాన సూర్యుడు ఉదయించ వ‌చ్చ‌ని కానీ బారామ‌తి గ‌డ్డ‌పై ప‌వార్ ల‌కు రాజ‌కీయ ఓట‌మి సాధ్యం కాద‌న్నారు. కాగా 2019లో తాను పోటీ చేయ‌లేద‌ని చెప్పారు రాష్ట్ర మంత్రి.

అయితే పాటిల్ చేసిన కామెంట్స్ పై కూడా కామెంట్ చేశారు సురేష్ ఖాడే(Suresh Khade). ఓట‌ర్లు రాజ‌కీయాల్లో గెలుపు ఓట‌ముల‌ను నిర్ణ‌యిస్తార‌ని ఆ మాత్రం తెలుసు కోక పోతే ఎలా అని ప్ర‌శ్నించారు.

ఇక మోదీకి ఢోకా లేద‌న్నారు. ఆయ‌న ప్ర‌జ‌ల హృద‌యాల్లో నిలిచి ఉన్నార‌ని స్ప‌ష్టం చేశారు.

Also Read : ఆర్టికల్ 370ని పున‌రుద్ద‌రించ‌లేం – ఆజాద్

Leave A Reply

Your Email Id will not be published!