NEET PG 2025 : నీట్ పీజీ పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ఈ నిర్ణయం విద్యార్థులకు సమాన అవకాశాలను కల్పించడంతో పాటు..

NEET PG 2025 : నీట్ పీజీ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ – పోస్ట్ గ్రాడ్యుయేట్) పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. సుప్రీంకోర్టు(Supreme Court) ఈ పరీక్ష విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. 2025 జూన్ 15న జరగనున్న నీట్ పీజీ(NEET PG 2025) పరీక్షను రెండు షిఫ్ట్‌లలో నిర్వహించాలన్న నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనికి బదులుగా, పరీక్షను ఒకే షిఫ్ట్‌లో నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం విద్యార్థులకు సమాన అవకాశాలను కల్పించడంతో పాటు, పరీక్ష ప్రక్రియలో పారదర్శకతను నిర్ధారించడానికి ఉద్దేశించబడింది.

NEET PG 2025 – Supreme Court

నీట్ పీజీ అనేది భారతదేశంలో వైద్య విద్యలో ఎండీ, ఎంఎస్, పీజీ డిప్లొమా కోర్సుల్లో చేరడానికి నిర్వహించే ఒక ముఖ్యమైన ప్రవేశ పరీక్ష. ఈ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా అనేక వైద్య కళాశాలల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లను భర్తీ చేస్తారు. ఈ పరీక్షను ఎన్‌బీఈ నిర్వహిస్తుంది. దీని ఫలితాల ఆధారంగా విద్యార్థులకు ర్యాంకులు, సీట్లు కేటాయించబడతాయి. ఈ ఏడాది, నీట్ పీజీ 2025 పరీక్షను జూన్ 15న నిర్వహించి, జులై 15న ఫలితాలు ప్రకటించాలని ఎన్‌బీఈ ప్రకటించింది. అయితే, ఈ పరీక్షను రెండు షిఫ్ట్‌లలో నిర్వహించాలన్న నిర్ణయం విద్యార్థుల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొంది.

గతంలో, నీట్ పీజీ 2024 పరీక్షను రెండు షిఫ్ట్‌లలో నిర్వహించారు. ఈ రెండు షిఫ్ట్‌లలో వేర్వేరు ప్రశ్నపత్రాలు ఉండడం వల్ల, ఒక షిఫ్ట్‌లోని ప్రశ్నలు సులభంగా, మరొక షిఫ్ట్‌లోని ప్రశ్నలు కఠినంగా ఉన్నాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విభిన్న కఠినత స్థాయిలను సమతుల్యం చేయడానికి ఎన్‌బీఈ నార్మలైజేషన్ పద్ధతిని ఉపయోగించింది. అయినప్పటికీ, ఈ నార్మలైజేషన్ ప్రక్రియ పారదర్శకత లేకపోవడం, స్కోర్లలో అసమానతలు రావడం వంటి సమస్యలు తలెత్తాయి. ఈ కారణంగా, చాలా మంది విద్యార్థులు తమ ర్యాంకులు ఊహించిన దానికంటే తక్కువగా వచ్చాయని ఫిర్యాదు చేశారు. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని, నీట్ పీజీ 2025ను కూడా రెండు షిఫ్ట్‌లలో నిర్వహించాలన్న ఎన్‌బీఈ నిర్ణయాన్ని విద్యార్థులు, వైద్య సంఘాలు వ్యతిరేకించాయి.

జూన్ 15న జరగనున్న NEET-PG పరీక్షను రెండు షిఫ్టుల్లో నిర్వహించాలని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఈ తీర్పు వెలువడింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ ఎన్వీ అంజారియా సభ్యులుగా ఉన్న ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్ష నిర్వహించనున్న NBE, ఫలితాలను జూలై 15లోపు విడుదల చేయనున్నట్లు తెలిపింది. సుప్రీంకోర్టు తాజా నిర్ణయం లక్షలాది మెడికల్ అభ్యర్థుల్లో ఆశలు నింపుతోంది. పరీక్ష సమయాలు భిన్నంగా ఉన్నా, ఫలితాల్లో మాత్రం న్యాయం జరగేలా చర్యలు తీసుకోవాలని కోర్టు అభిప్రాయపడింది.

Also Read : Minister Rajnath Singh : ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి రాజ్ నాథ్ సింగ్ పాక్ కు మాస్ వార్నింగ్

Leave A Reply

Your Email Id will not be published!