Pawan Kalyan: వరద పీడిత గ్రామాలకు చెక్కులు అందజేసిన పవన్ కళ్యాణ్ !

వరద పీడిత గ్రామాలకు చెక్కులు అందజేసిన పవన్ కళ్యాణ్ !

Pawan Kalyan: ఏపీవ్యాప్తంగా వరద పీడిత గ్రామాలకు రూ.6 కోట్లు విరాళంగా ప్రకటించిన డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు బాధిత కుటుంబాలు రుణపడి ఉంటాయని పోలవరం ఎమ్మెల్యే చిర్రీ బాలరాజు అన్నారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం గ్రామంలో వరద పీడిత పంచాయతీలకు రూ.లక్ష చొప్పున పవన్ ప్రకటించిన విరాళం చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. గత వైకాపా పాలనలో పంచాయతీలకు నిధులను కేటాయించకపోగా ఉన్న నిధులను దారి మళ్లించారని, అయితే ఎన్డీఏ హయాంలో పంచాయతీలకు మహర్దశ వస్తుందన్నారు.

Pawan Kalyan Visit…

వరద పీడిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇతర శాఖల మంత్రులు, అధికారులు చేపట్టిన సహాయ చర్యలను ప్రజలు మెచ్చుకుంటున్నారని తెలిపారు. అయితే వైకాపా మాత్రం సామాజిక మాధ్యమాల వేదికగా సహాయక చర్యలపై దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. అనంతరం పోలవరం నియోజకవర్గంలోని 31 గ్రామ పంచాయతీలకు పవన్ కల్యాణ్ ప్రకటించిన రూ. లక్ష చెక్కులను ఆయా పంచాయతీ సర్పంచులకు ఎమ్మెల్యే బాలరాజు అందజేశారు.

Leave A Reply

Your Email Id will not be published!