Perni Nani : లంచాలు తిని కంచాలు మోగిస్తే ఎలా
మాజీ మంత్రి పేర్ని నాని షాకింగ్ కామెంట్స్
Perni Nani : తాడేపల్లి గూడెం – ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని నిప్పులు చెరిగారు. తెలుగుదేశం పార్టీపై , నాయకులైన చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే రాష్ట్రాన్ని లూటీ చేశారని ప్రస్తుతం జైలు కూడు తింటున్నా ఇంకా బుద్ది రావడం లేదన్నారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మాజీ సీఎం చంద్రబాబు నాయుడిపై కోర్టులలో పిటిషన్లు నమోదయ్యాయని, వాటన్నింటి నుండి స్టేలు తెచ్చుకుని ఇన్నాళ్ల పాటు దొరకకుండా తప్పించు తిరిగాడని ఎద్దేవా చేశారు పేర్ని నాని(Perni Nani ).
Perni Nani Shocking Comments on Chandrababu
కానీ జగన్ మోహన్ రెడ్డి వచ్చాక కథ అడ్డం తిరిగిందన్నారు. చంద్రబాబు నాయుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసిన అవినీతి, అక్రమాలు ఒక్కటొక్కటిగా బయట పడుతున్నాయని అన్నారు. రాబోయే రోజుల్లో ఇంకొన్ని కేసులు నమోదు కాక తప్పదన్నారు పేర్ని నాని.
జగన్ రెడ్డికి భయం అంటే ఏమిటో చూపిస్తానన్న మగోడు సీఐడీ నోటీసులు ఇచ్చే సరికి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడంటూ నారా లోకేష్ ను ఉద్దేశించి ఎద్దేవా చేశాడు. మోత మోగిద్దాం అంటూ టీడీపీ ఇచ్చిన పిలుపు పూర్తిగా అట్టర్ ప్లాప్ అయ్యిందంటూ మండిపడ్డారు.
ఎవరైనా అవినీతికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపడతారని కానీ టీడీపీ నేతలు అందుకు భిన్నంగా లంచాలు తినడమే కాక కంచాలు మోగించడం ఏమిటని ప్రశ్నించారు పేర్ని నాని.
Also Read : Telangana Govt : అన్న భాగ్యకు తెలంగాణ బియ్యం