PM Modi Tour : మోదీకి శ్రీ‌నివాస్ యాద‌వ్ స్వాగ‌తం

సీఎంకు బ‌దులు శ్రీ‌నివాస్ యాద‌వ్

PM Modi Tour : ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ శ‌నివారం రానున్నారు. దీంతో తీవ్ర ఉత్కంఠ నెల‌కొంది. వ‌రంగ‌ల్ లో భార‌తీయ జ‌న‌తా పార్టీ ఆధ్వ‌ర్యంలో విజ‌య్ సంక‌ల్ప్ స‌భ‌ను నిర్వ‌హిస్తోంది. దీంతో భారీ ఎత్తున భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేశారు. ఓరుగ‌ల్లు చుట్టు ప‌క్క‌ల 20 కిలోమీట‌ర్ల ప‌రిధిలో పెద్ద ఎత్తున పోలీసుల‌ను మోహ‌రించారు.

రూ. 6,000 కోట్లతో చేప‌ట్ట‌నున్న జాతీయ ర‌హ‌దారుల అభివృద్దికి, రూ. 521 కోట్లతో చేప‌ట్టే వ్యాగ‌న్ త‌యారీ యూనిట్ కు శంకుస్థాప‌న చేస్తారు. మూమునూరుకు చేరుకున్నారు. అక్క‌డ కొలువు తీరిన భ‌ద్ర‌కాళీ ఆల‌యాన్ని ద‌ర్శించుకుంటారు. 15 నిమిషాల పాటు పూజ‌లు చేస్తారు.

హ‌ద‌రాబాద్ కు చేరుకున్న ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ(PM Modi)కి ప్రోటోకాల్ ప్ర‌కారం తెలంగాణ సీఎం కేసీఆర్ స్వాగ‌తం ప‌ల‌కాల్సి ఉండ‌గా డుమ్మా కొట్టారు. సీఎంకు బ‌దులు మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ స్వాగ‌తం ప‌లికారు. మోదీ రాక సంద‌ర్భంగా ఎక్క‌డ చూసినా ఖాకీలే ద‌ర్శ‌నం ఇస్తున్నారు. దారి పొడ‌వునా వీళ్లే కొలువు తీరారు. సామాన్యులకు , ప్ర‌యాణీకుల‌కు తీవ్ర ఇబ్బంది ఏర్ప‌డ్డాయి.

ప్ర‌ధాని మోదీ స‌భ సంద‌ర్బంగా నాలుగు గంట‌ల పాటు 144వ సెక్ష‌న్ విధించారు. కేంద్ర‌, రాష్ట్ర పోలీసు బ‌ల‌గాలు మోహ‌రించాయి.

Also Read : Rahul Gandhi : పొలం ప‌నుల్లో రాహుల్ గాంధీ బిజీ

Leave A Reply

Your Email Id will not be published!