PM Narendra Modi: నవీన్‌ పట్నాయక్‌ ఆరోగ్యం క్షీణించడంపై ప్రధాని మోదీ ఆందోళన !

నవీన్‌ పట్నాయక్‌ ఆరోగ్యం క్షీణించడంపై ప్రధాని మోదీ ఆందోళన !

PM Narendra Modi: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు వస్తోన్న వార్తలపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. నవీన్ పట్నాయక్ ఆరోగ్యం క్షీణించడం వెనక ఏదైనా కుట్ర ఉందా? అన్న అనుమానాలు వ్యక్తంచేశారు. అంతేకాదు రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే… సీఎం నవీన్ పట్నాయక్ ఆరోగ్యం క్షీణించడానికి గల కారణాలను తేల్చేందుకు ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు. ఒడిశాలోని బారిపదాలో ఏర్పాటుచేసిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐదు దశాబ్దాల తర్వాత కేంద్రంలో వరుసగా మూడోసారి పూర్తిస్థాయి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనున్నామని ఆశాభావం వ్యక్తం చేసారు.

PM Narendra Modi Comment

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ… ‘‘నవీన్‌ పట్నాయక్‌ ఆరోగ్యం క్షీణంచడం వెనక ఏదైనా కుట్ర ఉందా? ఆయన తరఫున ప్రభుత్వాన్ని నడుపుతోన్న లాబీనే ముఖ్యమంత్రి ఆరోగ్యం క్షీణించడానికి కారణమా? ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే… నవీన్ పట్నాయక్‌ ఆరోగ్యం క్షీణించడానికి గల కారణాలను అన్వేషించేందుకు కమిటీని ఏర్పాటుచేస్తాం’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఒడిశా ముఖ్యమంత్రి కదలికలను కూడా సీఎం సన్నిహితుడు పాండియన్‌ నియంత్రిస్తున్నాడంటూ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఆరోపించిన మరుసటిరోజే ప్రధాని ఈవిధంగా స్పందించడం గమనార్హం.

Also Read : Weather Updates : 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఎక్కువనుకుంటే ఇపుడు 50 డిగ్రీలకు పైగా…

Leave A Reply

Your Email Id will not be published!